వచ్చే శుక్రవారానికి ముందు అనుకున్న ప్రకారం అయితే మూడు పేరున్న సినిమాలు రావాల్సింది. రామ్-బోయపాటిల ‘స్కంద’తో పాటు అనువాద చిత్రాలు చంద్రముఖి-2, మార్క్ ఆంటోనీ సెప్టెంబరు 15కు రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అనూహ్య పరిణామాల మధ్య, స్కంద, చంద్రముఖి-2 వాయిదా పడిపోయాయి. ఇక సోలో రిలీజ్తో ‘మార్క్ ఆంటోనీ’ పండుగ చేసుకోబోతోందని అనుకుంటే.. లైకా ప్రొడక్షన్స్తో విశాల్కు ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా ఈ సినిమా రిలీజ్ మీద మద్రాస్ హైకోర్టు స్టే విధించినట్లు మూడు రోజుల కిందట వార్తలు రావడం తెలిసిందే.
దీంతో ఆ చిత్ర బృందంతో పాటు సినీ ప్రియుల్లో కూడా నిట్టూర్పులు మొదలయ్యాయి. వచ్చే వారం కూడా బాక్సాఫీస్ బోసిపోతుందని బాధ పడ్డారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే.. ‘మార్క్ ఆంటోనీ’ యధాప్రకారం సెప్టెంబరు 15నే రిలీజయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తన సినిమా స్టే వార్తలపై విశాల్ ఇంత వరకు స్పందించనే లేదు. ఒక్క రోజు మాత్రం సోషల్ మీడియాలో కూడా సినిమాను ప్రమోట్ చేయడం ఆపేసి ఊరుకున్నాడు.
కానీ తర్వాతి రోజు నుంచి ప్రమోషన్లు కొనసాగిస్తున్నాడు. సినిమా నుంచి కొత్త పాట రిలీజ్ చేశాడు. అలాగే ‘మార్క్ ఆంటోనీ’ తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్కు ముహూర్తం కూడా పెట్టించాడు. ఆదివారం సాయంత్రం నితిన్ ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ జరగబోతోంది. తమిళంలో కూడా ప్రమోషన్లు కొనసాగుతున్నాయి. ఐతే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. గత రెండు రోజుల నుంచి రిలీజ్ డేట్ గురించి మాత్రం విశాల్ అండ్ కో మాట్లాడట్లేదు.
పోస్టర్లు, సోషల్ మీడియా పోస్టుల్లో సెప్టెంబరు 15న సినిమా రిలీజ్ అనే విషయాన్ని ప్రస్తావించట్లేదు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ విషయం ప్రస్తావించట్లేదని తెలుస్తోంది. ఐతే ఈ ఇష్యూ ఒకట్రెండు రోజుల్లో సమసిపోతుందనే అంచనాతో టీం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ ఏమైనా జరుగుతుండొచ్చు. అది జరగ్గానే అధికారికంగా డేట్ ప్రకటించి వచ్చే శుక్రవారమే సినిమాను రిలీజ్ చేసేట్లు కనిపిస్తోంది.
This post was last modified on September 10, 2023 2:25 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…