Movie News

రిలీజ్‌పై స్టే అన్నారు.. విశాల్ మాత్రం తగ్గట్లేదు

వచ్చే శుక్రవారానికి ముందు అనుకున్న ప్రకారం అయితే మూడు పేరున్న సినిమాలు రావాల్సింది. రామ్-బోయపాటిల ‘స్కంద’తో పాటు అనువాద చిత్రాలు చంద్రముఖి-2, మార్క్ ఆంటోనీ సెప్టెంబరు 15కు రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అనూహ్య పరిణామాల మధ్య, స్కంద, చంద్రముఖి-2 వాయిదా పడిపోయాయి. ఇక సోలో రిలీజ్‌తో ‘మార్క్ ఆంటోనీ’ పండుగ చేసుకోబోతోందని అనుకుంటే.. లైకా ప్రొడక్షన్స్‌తో విశాల్‌కు ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా ఈ సినిమా రిలీజ్ మీద మద్రాస్ హైకోర్టు స్టే విధించినట్లు మూడు రోజుల కిందట వార్తలు రావడం తెలిసిందే.

దీంతో ఆ చిత్ర బృందంతో పాటు సినీ ప్రియుల్లో కూడా నిట్టూర్పులు మొదలయ్యాయి. వచ్చే వారం కూడా బాక్సాఫీస్ బోసిపోతుందని బాధ పడ్డారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే.. ‘మార్క్ ఆంటోనీ’ యధాప్రకారం సెప్టెంబరు 15నే రిలీజయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తన సినిమా స్టే వార్తలపై విశాల్ ఇంత వరకు స్పందించనే లేదు. ఒక్క రోజు మాత్రం సోషల్ మీడియాలో కూడా సినిమాను ప్రమోట్ చేయడం ఆపేసి ఊరుకున్నాడు.

కానీ తర్వాతి రోజు నుంచి ప్రమోషన్లు కొనసాగిస్తున్నాడు. సినిమా నుంచి కొత్త పాట రిలీజ్ చేశాడు. అలాగే ‘మార్క్ ఆంటోనీ’ తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం కూడా పెట్టించాడు. ఆదివారం సాయంత్రం నితిన్ ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ జరగబోతోంది. తమిళంలో కూడా ప్రమోషన్లు కొనసాగుతున్నాయి. ఐతే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. గత రెండు రోజుల నుంచి రిలీజ్ డేట్ గురించి మాత్రం విశాల్ అండ్ కో మాట్లాడట్లేదు.

పోస్టర్లు, సోషల్ మీడియా పోస్టుల్లో సెప్టెంబరు 15న సినిమా రిలీజ్ అనే విషయాన్ని ప్రస్తావించట్లేదు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ విషయం ప్రస్తావించట్లేదని తెలుస్తోంది. ఐతే ఈ ఇష్యూ ఒకట్రెండు రోజుల్లో సమసిపోతుందనే అంచనాతో టీం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ ఏమైనా జరుగుతుండొచ్చు. అది జరగ్గానే అధికారికంగా డేట్ ప్రకటించి వచ్చే శుక్రవారమే సినిమాను రిలీజ్ చేసేట్లు కనిపిస్తోంది.

This post was last modified on September 10, 2023 2:25 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

10 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

1 hour ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

1 hour ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

2 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

2 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

3 hours ago