సినిమా అయినా రాజకీయమైనా అపోజిషన్ బలంగా ఉన్నప్పుడు గెలుపు అంత సులభంగా ఉండదు. అందులోనూ షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వసూళ్ల వీరంగం ఆడుతుంటే ఒక రామ్ కామ్ మూవీ ఎదురుగా తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ కంటెంట్ ఉంటే ఇదేమి కష్టం కాదని నిరూపిస్తోంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మూడు రోజులకు గాను 9 కోట్ల దగ్గరగా షేర్ అందుకుని బాప్రే అనిపించేసింది. గ్రాస్ చూసుకుంటే ఇది 17 కోట్ల పైమాటే. ఓవర్సీస్ లో ఇవాళ ఆదివారం మిలియన్ మార్క్ లాంఛనం సులభంగా పూర్తవుతుంది.
ఇంకో నాలుగున్నర కోట్లు దాటేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వెళ్ళిపోతుంది. నవీన్ పోలిశెట్టి ప్రమోషన్ల పరంగా పడిన కష్టానికి తగ్గ ఫలితం కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. నిజానికి జవాన్ తాకిడిని ఇలాంటి మూవీ తట్టుకోగలదానే అనుమానాలే ఎక్కువగా వచ్చాయి. అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ రెస్పాన్స్ బాగుండటం గమనించాల్సిన విషయం. విజయ్ దేవరకొండ ఖుషిని అంతగా రిసీవ్ చేసుకోలేకపోయిన ఎన్ఆర్ఐలు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని మాత్రం అక్కున చేరుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ జవాన్ కంటే దీనివైపే మొగ్గుచూపడం అసలు ట్విస్టు.
సో నవీన్ కు హ్యాట్రిక్ పూర్తయినట్టే. అనుష్కకు మంచి కంబ్యాక్ దొరికినట్టే. దీన్ని బట్టి సున్నితమైన అంశాలను టేకప్ చేస్తే క్రమంగా ప్రేక్షకులు ఆదరిస్తారనే క్లారిటీ వచ్చేసింది. జవాన్ ఊర మాస్ ముందు శెట్టి క్లాస్ ఇంత తట్టుకుని నిలవడం మాములు విషయం కాదు. వచ్చే వారం చాంగురే బంగారు రాజా, మార్క్ ఆంటోనీ తప్ప చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. టాక్ వస్తేనే నిలబడగలిగే కంటెంట్ లవి. సో శెట్టి జంట అంత సులభంగా స్లో అవ్వడం ఉండదు. పైగా వచ్చేది పండగ రోజులు కాబట్టి మళ్ళీ సోమవారం దాక వసూళ్లు లాగేయొచ్చు.ఎంత లాభం మిగులుతుందనేది వేచి చూడాలి.
This post was last modified on September 10, 2023 2:23 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…