Movie News

శభాష్ శెట్టి…ఇది కదా గెలుపంటే

సినిమా అయినా రాజకీయమైనా అపోజిషన్ బలంగా ఉన్నప్పుడు గెలుపు అంత సులభంగా ఉండదు. అందులోనూ షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వసూళ్ల వీరంగం ఆడుతుంటే ఒక రామ్ కామ్ మూవీ ఎదురుగా తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ కంటెంట్ ఉంటే ఇదేమి కష్టం కాదని నిరూపిస్తోంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మూడు రోజులకు గాను 9 కోట్ల దగ్గరగా షేర్ అందుకుని బాప్రే అనిపించేసింది. గ్రాస్ చూసుకుంటే ఇది 17 కోట్ల పైమాటే. ఓవర్సీస్ లో ఇవాళ ఆదివారం మిలియన్ మార్క్ లాంఛనం సులభంగా పూర్తవుతుంది.

ఇంకో నాలుగున్నర కోట్లు దాటేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వెళ్ళిపోతుంది. నవీన్ పోలిశెట్టి ప్రమోషన్ల పరంగా పడిన కష్టానికి తగ్గ ఫలితం కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. నిజానికి జవాన్ తాకిడిని ఇలాంటి మూవీ తట్టుకోగలదానే అనుమానాలే ఎక్కువగా వచ్చాయి. అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ రెస్పాన్స్ బాగుండటం గమనించాల్సిన విషయం. విజయ్ దేవరకొండ ఖుషిని అంతగా రిసీవ్ చేసుకోలేకపోయిన ఎన్ఆర్ఐలు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని మాత్రం అక్కున చేరుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ జవాన్ కంటే దీనివైపే మొగ్గుచూపడం అసలు ట్విస్టు.

సో నవీన్ కు హ్యాట్రిక్ పూర్తయినట్టే. అనుష్కకు మంచి కంబ్యాక్ దొరికినట్టే. దీన్ని బట్టి సున్నితమైన అంశాలను టేకప్ చేస్తే క్రమంగా ప్రేక్షకులు ఆదరిస్తారనే క్లారిటీ వచ్చేసింది. జవాన్ ఊర మాస్ ముందు శెట్టి క్లాస్ ఇంత తట్టుకుని నిలవడం మాములు విషయం కాదు. వచ్చే వారం చాంగురే బంగారు రాజా, మార్క్ ఆంటోనీ తప్ప చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. టాక్ వస్తేనే నిలబడగలిగే కంటెంట్ లవి. సో శెట్టి జంట అంత సులభంగా స్లో అవ్వడం ఉండదు. పైగా వచ్చేది పండగ రోజులు కాబట్టి మళ్ళీ సోమవారం దాక వసూళ్లు లాగేయొచ్చు.ఎంత లాభం మిగులుతుందనేది వేచి చూడాలి. 

This post was last modified on September 10, 2023 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago