సినిమా అయినా రాజకీయమైనా అపోజిషన్ బలంగా ఉన్నప్పుడు గెలుపు అంత సులభంగా ఉండదు. అందులోనూ షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వసూళ్ల వీరంగం ఆడుతుంటే ఒక రామ్ కామ్ మూవీ ఎదురుగా తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ కంటెంట్ ఉంటే ఇదేమి కష్టం కాదని నిరూపిస్తోంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మూడు రోజులకు గాను 9 కోట్ల దగ్గరగా షేర్ అందుకుని బాప్రే అనిపించేసింది. గ్రాస్ చూసుకుంటే ఇది 17 కోట్ల పైమాటే. ఓవర్సీస్ లో ఇవాళ ఆదివారం మిలియన్ మార్క్ లాంఛనం సులభంగా పూర్తవుతుంది.
ఇంకో నాలుగున్నర కోట్లు దాటేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వెళ్ళిపోతుంది. నవీన్ పోలిశెట్టి ప్రమోషన్ల పరంగా పడిన కష్టానికి తగ్గ ఫలితం కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. నిజానికి జవాన్ తాకిడిని ఇలాంటి మూవీ తట్టుకోగలదానే అనుమానాలే ఎక్కువగా వచ్చాయి. అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ రెస్పాన్స్ బాగుండటం గమనించాల్సిన విషయం. విజయ్ దేవరకొండ ఖుషిని అంతగా రిసీవ్ చేసుకోలేకపోయిన ఎన్ఆర్ఐలు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని మాత్రం అక్కున చేరుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ జవాన్ కంటే దీనివైపే మొగ్గుచూపడం అసలు ట్విస్టు.
సో నవీన్ కు హ్యాట్రిక్ పూర్తయినట్టే. అనుష్కకు మంచి కంబ్యాక్ దొరికినట్టే. దీన్ని బట్టి సున్నితమైన అంశాలను టేకప్ చేస్తే క్రమంగా ప్రేక్షకులు ఆదరిస్తారనే క్లారిటీ వచ్చేసింది. జవాన్ ఊర మాస్ ముందు శెట్టి క్లాస్ ఇంత తట్టుకుని నిలవడం మాములు విషయం కాదు. వచ్చే వారం చాంగురే బంగారు రాజా, మార్క్ ఆంటోనీ తప్ప చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. టాక్ వస్తేనే నిలబడగలిగే కంటెంట్ లవి. సో శెట్టి జంట అంత సులభంగా స్లో అవ్వడం ఉండదు. పైగా వచ్చేది పండగ రోజులు కాబట్టి మళ్ళీ సోమవారం దాక వసూళ్లు లాగేయొచ్చు.ఎంత లాభం మిగులుతుందనేది వేచి చూడాలి.
This post was last modified on September 10, 2023 2:23 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…