సినిమా అయినా రాజకీయమైనా అపోజిషన్ బలంగా ఉన్నప్పుడు గెలుపు అంత సులభంగా ఉండదు. అందులోనూ షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వసూళ్ల వీరంగం ఆడుతుంటే ఒక రామ్ కామ్ మూవీ ఎదురుగా తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ కంటెంట్ ఉంటే ఇదేమి కష్టం కాదని నిరూపిస్తోంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మూడు రోజులకు గాను 9 కోట్ల దగ్గరగా షేర్ అందుకుని బాప్రే అనిపించేసింది. గ్రాస్ చూసుకుంటే ఇది 17 కోట్ల పైమాటే. ఓవర్సీస్ లో ఇవాళ ఆదివారం మిలియన్ మార్క్ లాంఛనం సులభంగా పూర్తవుతుంది.
ఇంకో నాలుగున్నర కోట్లు దాటేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వెళ్ళిపోతుంది. నవీన్ పోలిశెట్టి ప్రమోషన్ల పరంగా పడిన కష్టానికి తగ్గ ఫలితం కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. నిజానికి జవాన్ తాకిడిని ఇలాంటి మూవీ తట్టుకోగలదానే అనుమానాలే ఎక్కువగా వచ్చాయి. అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ రెస్పాన్స్ బాగుండటం గమనించాల్సిన విషయం. విజయ్ దేవరకొండ ఖుషిని అంతగా రిసీవ్ చేసుకోలేకపోయిన ఎన్ఆర్ఐలు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని మాత్రం అక్కున చేరుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ జవాన్ కంటే దీనివైపే మొగ్గుచూపడం అసలు ట్విస్టు.
సో నవీన్ కు హ్యాట్రిక్ పూర్తయినట్టే. అనుష్కకు మంచి కంబ్యాక్ దొరికినట్టే. దీన్ని బట్టి సున్నితమైన అంశాలను టేకప్ చేస్తే క్రమంగా ప్రేక్షకులు ఆదరిస్తారనే క్లారిటీ వచ్చేసింది. జవాన్ ఊర మాస్ ముందు శెట్టి క్లాస్ ఇంత తట్టుకుని నిలవడం మాములు విషయం కాదు. వచ్చే వారం చాంగురే బంగారు రాజా, మార్క్ ఆంటోనీ తప్ప చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. టాక్ వస్తేనే నిలబడగలిగే కంటెంట్ లవి. సో శెట్టి జంట అంత సులభంగా స్లో అవ్వడం ఉండదు. పైగా వచ్చేది పండగ రోజులు కాబట్టి మళ్ళీ సోమవారం దాక వసూళ్లు లాగేయొచ్చు.ఎంత లాభం మిగులుతుందనేది వేచి చూడాలి.
This post was last modified on September 10, 2023 2:23 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక…
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…
ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన…
అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని…