ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్స్ ట్రెండ్ నడుస్తుంది. పాత తమిళ కథలను వెతికి మరీ రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి కూడా భోళా శంకర్ తో వేదాళం రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తేరి రీమేక్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నాడు. ఇదే హరీష్ శంకర్ కాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండ’ ను తెలుగులో కొన్ని మార్పులతో ‘గద్దల కొండ గణేష్’ గా రీమేక్ చేశాడు.
ఇప్పుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘జిగర్తాండ డబులెక్స్’ టైటిల్ తో సీక్వెల్ చేశాడు. లారెన్స్ , ఎస్ జే సూర్య కథానాయకులుగా నటిస్తున్నారు. ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పైగా లారెన్స్ కి తెలుగులో మంచి మార్కెట్ కూడా ఉంది. అందుకే ఈ సీక్వెల్ సినిమాను ముందు నుండే తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. దీంతో అదే టైటిల్ తెలుగులో డిజైన్ చేయించి పోస్టర్స్ వదిలారు.
11న టీజర్ రాబోతుంది. తెలుగులో కూడా ఒకేసారి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ లాంటి వాళ్ళు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా మేకర్స్ ముందే ప్లాన్ చేసుకున్నారు. జిగర్తాండ సినిమాను మంచి ఎంటర్టైన్ మెంట్ మిక్స్ చేసి తెరకెక్కించిన కార్తీక్ ఈసారి డబులెక్స్ అంటూ డబుల్ ఎంటర్టైన్ మెంట్ రెడీ చేస్తున్నాడు. ఈ కోలీవుడ్ క్రేజీ సీక్వెల్ తెలుగులో డబ్బింగ్ మూవీగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో ?
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…
పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్…
శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…