ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్స్ ట్రెండ్ నడుస్తుంది. పాత తమిళ కథలను వెతికి మరీ రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి కూడా భోళా శంకర్ తో వేదాళం రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తేరి రీమేక్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నాడు. ఇదే హరీష్ శంకర్ కాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండ’ ను తెలుగులో కొన్ని మార్పులతో ‘గద్దల కొండ గణేష్’ గా రీమేక్ చేశాడు.
ఇప్పుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘జిగర్తాండ డబులెక్స్’ టైటిల్ తో సీక్వెల్ చేశాడు. లారెన్స్ , ఎస్ జే సూర్య కథానాయకులుగా నటిస్తున్నారు. ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పైగా లారెన్స్ కి తెలుగులో మంచి మార్కెట్ కూడా ఉంది. అందుకే ఈ సీక్వెల్ సినిమాను ముందు నుండే తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. దీంతో అదే టైటిల్ తెలుగులో డిజైన్ చేయించి పోస్టర్స్ వదిలారు.
11న టీజర్ రాబోతుంది. తెలుగులో కూడా ఒకేసారి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ లాంటి వాళ్ళు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా మేకర్స్ ముందే ప్లాన్ చేసుకున్నారు. జిగర్తాండ సినిమాను మంచి ఎంటర్టైన్ మెంట్ మిక్స్ చేసి తెరకెక్కించిన కార్తీక్ ఈసారి డబులెక్స్ అంటూ డబుల్ ఎంటర్టైన్ మెంట్ రెడీ చేస్తున్నాడు. ఈ కోలీవుడ్ క్రేజీ సీక్వెల్ తెలుగులో డబ్బింగ్ మూవీగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో ?
This post was last modified on September 10, 2023 12:28 am
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…