2023 సంవత్సరం తెలుగు సినీ అభిమానులకు చాలా వరకు నిరాశనే మిగిల్చింది. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులకు ఈ సంవత్సరం ఆశించిన జోష్ ఇవ్వలేదు. టాప్ స్టార్ల సినిమాలు ఈ ఏడాది చాలా తక్కువగా రిలీజయ్యాయి. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే రెండేసి రిలీజ్లు సెట్ చేసుకున్నారు. అందులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్బస్టర్ కొట్టిన ఉత్సాహం కాస్తా.. ‘భోళా శంకర్’ డిజాస్టర్తో నీరుగారిపోయింది. బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో హిట్ కొట్టాడు.
‘భగవంత్ కేసరి’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ప్రభాస్ ‘ఆదిపురుష్’తో నిరాశ పరిచాడు. ‘సలార్’ రిలీజ్ సంగతి డోలాయమానంలో పడింది. పవన్ కళ్యాన్ ‘బ్రో’ మూవీతో మమ అనిపించాడు. ఆ సినిమా పట్ల అభిమానుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ల సినిమాలేవీ ఈ ఏడాది విడుదల కాకపోవడం వారి అభిమానులను నిరాశపరిచింది.
ఐతే 2024లో మాత్రం స్టార్ సినిమాల మామూలుగా ఉండేలా లేదు. అభిమానులు కోరుకున్న స్థాయిలో పెద్ద హీరోలు భారీ, క్రేజీ చిత్రాలతో అభిమానులను అలరించబోతున్నారు. ముందుగా సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ లాంటి మాస్ మూవీతో అభిమానుల ముందుకు వస్తాడు. వేసవిలో అల్లు అర్జున్ చిత్రం ‘పుష్ప-2’, జూనియర్ ఎన్టీఆర్ మూవీ ‘దేవర’ రిలీజ్ కానున్నాయి.
ఈ రెండూ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదల కానున్నాయి. అవి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపుతాయని భావిస్తున్నారు. ఇక ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ లాంటి మెగా మూవీతో రాబోతున్నాడు. దానికున్న హైప్ సంగతి తెలిసిందే. ఇక రీఎంట్రీలో వరుసగా రీమేక్ సినిమాలతో నిరాశపరిచిన పవన్.. తన స్టామినాకు తగ్గ ‘ఓజీ’తో వచ్చే ఏడాది అభిమానులను పలకరించబోతున్నాడు. దీనిపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మరోవైపు రామ్ చరణ్ వచ్చే ఏడాదే ‘గేమ్ చేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిరంజీవి.. వశిష్ఠ దర్శకత్వంలో చేసే సినిమా కూడా వచ్చే ఏడాదే రిలీజయ్యే అవకాశముంది. బాలయ్య-బాబీ సినిమా కూడా మంచి క్రేజ్ ఉన్నదే. నాగ్ కూడా ‘నా సామి రంగా’తో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని భావిస్తున్నారు. ఇలా కొత్త ఏడాదిలో టాప్ స్టార్లందరూ అభిమానుల ఆకాంక్షలకు తగ్గ సినిమాలతో అలరించే అవకాశముంది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…