గత వారం వచ్చిన ‘ఖుషి’ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుని వీకెండ్ వరకు మంచి వసూళ్లే రాబట్టింది. కానీ ఆ తర్వాత సినిమా ఏమాత్రం నిలబడలేకపోయింది. సినిమా ఇంకొంచెం మెరుగ్గా ఉండి ఉంటే ఆ పరిస్థితి రాకపోయేదేమో. ‘ఖుషి’లో ప్లస్సుల కంటే మైనస్లు ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా ప్రేమకథలకు బాగా సూటవుతుందని, ఆకర్షణ అవుతుందని పేరున్న హీరోయిన్ సమంత ఈ చిత్రానికి మాత్రం ఎసెట్ కాలేకపోయింది.
విజయ్తో ఆమెకు అస్సలు జోడీ కుదరలేదని చెప్పొచ్చు. విజయ్తో పోలిస్తే వయసులో పెద్దదిగా కనిపించడం.. లుక్స్ ఆకర్షణీయంగా లేకపోవడం మైనస్ అయ్యాయి. ప్రేమకథలకు అత్యంత ముఖ్యమైంది లీడ్ పెయిరే. ఇద్దరికీ జోడీ కుదరడం.. కెమిస్ట్రీ పండడం చాలా ముఖ్యం. ‘ఖుషి’లో అది జరగలేదు. ఇక ఈ వారం వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి కూడా ఇదే సమస్య తలెత్తుతందేమో అన్న సందేహాలు కలిగాయి.
నవీన్ పొలిశెట్టితో పోలిస్తే అనుష్క వయసులో పెద్దది కావడంతో వీరి మధ్య లవ్ స్టోరీ ఏంటో అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనికి తోడు అనుష్క లుక్స్ కూడా ట్రైలర్లో ఆర్టిఫిషియల్గా కనిపించడంతో ఆమె వల్ల సినిమా చెడిపోతుందేమో అన్న డౌట్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో బుర్రలో అనుమానాలు పెట్టుకునే సినిమా చూశారు ప్రేక్షకులు. ఐతే ఈ సినిమాకు అనుష్క మైనస్ కాలేదు. అలా అని ప్లస్ అయిందని కూడా చెప్పలేం. కానీ అనుష్క వల్ల సినిమా అయితే చెడిపోలేదు.
కథ ప్రకారమే హీరో కంటే హీరోయిన్ వయసు ఐదేళ్లు ఎక్కువ అన్నట్లు చూపించడంతో ఇద్దరి మధ్య వయసు అంతరం అనేది సమస్యగా మారలేదు. పైగా ఫిజికల్ రొమాన్స్ చూపించాల్సిన అవసరం రాకుండా కథను మెచ్యూర్డ్గా డీల్ చేయడంతో సమస్యే తలెత్తలేదు. ఇక లుక్స్ పరంగా అనుష్క కొంచెం కృత్రిమంగా కనిపించిన మాట వాస్తవమే అయినా.. తన పెర్ఫామెన్స్తో ఆ బలహీనతను స్వీటీ కవర్ చేసింది. పైగా నవీన్ పొలిశెట్టి సినిమాలో లోపాలన్నీ కవర్ చేస్తూ ఎంటర్టైన్ చేయడంతో సినిమా సాఫీగా సాగిపోయి ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.
This post was last modified on September 9, 2023 10:44 am
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…