గత వారం వచ్చిన ‘ఖుషి’ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుని వీకెండ్ వరకు మంచి వసూళ్లే రాబట్టింది. కానీ ఆ తర్వాత సినిమా ఏమాత్రం నిలబడలేకపోయింది. సినిమా ఇంకొంచెం మెరుగ్గా ఉండి ఉంటే ఆ పరిస్థితి రాకపోయేదేమో. ‘ఖుషి’లో ప్లస్సుల కంటే మైనస్లు ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా ప్రేమకథలకు బాగా సూటవుతుందని, ఆకర్షణ అవుతుందని పేరున్న హీరోయిన్ సమంత ఈ చిత్రానికి మాత్రం ఎసెట్ కాలేకపోయింది.
విజయ్తో ఆమెకు అస్సలు జోడీ కుదరలేదని చెప్పొచ్చు. విజయ్తో పోలిస్తే వయసులో పెద్దదిగా కనిపించడం.. లుక్స్ ఆకర్షణీయంగా లేకపోవడం మైనస్ అయ్యాయి. ప్రేమకథలకు అత్యంత ముఖ్యమైంది లీడ్ పెయిరే. ఇద్దరికీ జోడీ కుదరడం.. కెమిస్ట్రీ పండడం చాలా ముఖ్యం. ‘ఖుషి’లో అది జరగలేదు. ఇక ఈ వారం వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి కూడా ఇదే సమస్య తలెత్తుతందేమో అన్న సందేహాలు కలిగాయి.
నవీన్ పొలిశెట్టితో పోలిస్తే అనుష్క వయసులో పెద్దది కావడంతో వీరి మధ్య లవ్ స్టోరీ ఏంటో అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనికి తోడు అనుష్క లుక్స్ కూడా ట్రైలర్లో ఆర్టిఫిషియల్గా కనిపించడంతో ఆమె వల్ల సినిమా చెడిపోతుందేమో అన్న డౌట్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో బుర్రలో అనుమానాలు పెట్టుకునే సినిమా చూశారు ప్రేక్షకులు. ఐతే ఈ సినిమాకు అనుష్క మైనస్ కాలేదు. అలా అని ప్లస్ అయిందని కూడా చెప్పలేం. కానీ అనుష్క వల్ల సినిమా అయితే చెడిపోలేదు.
కథ ప్రకారమే హీరో కంటే హీరోయిన్ వయసు ఐదేళ్లు ఎక్కువ అన్నట్లు చూపించడంతో ఇద్దరి మధ్య వయసు అంతరం అనేది సమస్యగా మారలేదు. పైగా ఫిజికల్ రొమాన్స్ చూపించాల్సిన అవసరం రాకుండా కథను మెచ్యూర్డ్గా డీల్ చేయడంతో సమస్యే తలెత్తలేదు. ఇక లుక్స్ పరంగా అనుష్క కొంచెం కృత్రిమంగా కనిపించిన మాట వాస్తవమే అయినా.. తన పెర్ఫామెన్స్తో ఆ బలహీనతను స్వీటీ కవర్ చేసింది. పైగా నవీన్ పొలిశెట్టి సినిమాలో లోపాలన్నీ కవర్ చేస్తూ ఎంటర్టైన్ చేయడంతో సినిమా సాఫీగా సాగిపోయి ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.
This post was last modified on September 9, 2023 10:44 am
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం…
ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…