సోలో రిలీజ్ దక్కిందని విశాల్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్న టైంలో మార్క్ ఆంటోనీ విడుదలను మదరాస్ హై కోర్టు ఆపిందనే వార్త తెగ అయోమయం రేపుతోంది. ఒక లావాదేవీకి సంబంధించి లైకా ప్రొడక్షన్స్ సంస్థకు 15 కోట్లు విశాల్ చెల్లించాలని, అందుకే న్యాయస్థానం పన్నెండో తేదీకి అతన్ని హాజరు కమ్మని కోరిందని ట్విట్టర్ లో పెద్ద ప్రచారమే మొదలైంది. దీన్ని ఖండిస్తూ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తో పాటు నిర్మాత వినోద్ కుమార్ స్పందించారు. సదరు వార్తను ప్రసారం చేసిన టీవీ ఛానల్ మీద చర్య తీసుకుంటామని ప్రకటిస్తూ దీన్ని ప్రచారం చేయొద్దని కోరారు.
నిజానికి ఈ వివాదానికి సంబంధించిన వ్యవహారం గతంలో కోర్టుకు వచ్చిన మాట వాస్తవమే కానీ ఆ తర్వాత ఏం జరిగిందో సరైన అప్డేట్స్ లేవు. ఇప్పుడేదో హఠాత్తుగా మార్క్ ఆంటోనీ రిలీజ్ ముంగిట్లో ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం వెనుక ఎవరిదో అజెండా ఉందని చెన్నై మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి. చంద్రముఖి 2 వాయిదా పడిన నేపథ్యంలో మార్క్ ఆంటోనీకి మంచి అవకాశం దొరికిందని సంబరపడుతున్న టైంలో సడన్ గా వచ్చిన ఈ ట్విస్ట్ కన్ఫ్యూజన్ రేపిన మాట వాస్తవం. విశాల్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ప్రస్తుతానికి రాలేదు.
టీమ్ యథాతధంగా ప్రమోషన్లు చేసుకుంటోంది. తెలుగులోనూ ఈవెంట్ తో పాటు మీడియా ప్రెస్ మీట్లకు ప్లాన్ చేస్తున్నారు. అందివచ్చిన ఈ ఛాన్స్ ని పూర్తిగా వాడుకునేందుకు విశాల్ చాలా ఉత్సాహంతో ఉన్నాడు. ట్రైలర్ చూశాక ఇదేదో వెరైటీ మాఫియా డ్రామాగా గుర్తించిన ప్రేక్షకుల్లో మెల్లగా ఆసక్తి పెరుగుతోంది. మునుపటి మార్కెట్ లేకపోయినా సరైన హిట్టు ఒకటిపడితే జనాన్ని థియేటర్ కు రప్పించే ఇమేజ్ అయితే విశాల్ కు ఇప్పటికీ ఉంది. ఎస్జె సూర్య స్నేహితుడిగా నటించిన ఈ టైం ట్రావెల్ డ్రామాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. హీరో గెటప్స్ చాలా వెరైటీగా ఉన్నాయి.
This post was last modified on September 8, 2023 11:10 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…