సోలో రిలీజ్ దక్కిందని విశాల్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్న టైంలో మార్క్ ఆంటోనీ విడుదలను మదరాస్ హై కోర్టు ఆపిందనే వార్త తెగ అయోమయం రేపుతోంది. ఒక లావాదేవీకి సంబంధించి లైకా ప్రొడక్షన్స్ సంస్థకు 15 కోట్లు విశాల్ చెల్లించాలని, అందుకే న్యాయస్థానం పన్నెండో తేదీకి అతన్ని హాజరు కమ్మని కోరిందని ట్విట్టర్ లో పెద్ద ప్రచారమే మొదలైంది. దీన్ని ఖండిస్తూ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తో పాటు నిర్మాత వినోద్ కుమార్ స్పందించారు. సదరు వార్తను ప్రసారం చేసిన టీవీ ఛానల్ మీద చర్య తీసుకుంటామని ప్రకటిస్తూ దీన్ని ప్రచారం చేయొద్దని కోరారు.
నిజానికి ఈ వివాదానికి సంబంధించిన వ్యవహారం గతంలో కోర్టుకు వచ్చిన మాట వాస్తవమే కానీ ఆ తర్వాత ఏం జరిగిందో సరైన అప్డేట్స్ లేవు. ఇప్పుడేదో హఠాత్తుగా మార్క్ ఆంటోనీ రిలీజ్ ముంగిట్లో ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం వెనుక ఎవరిదో అజెండా ఉందని చెన్నై మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి. చంద్రముఖి 2 వాయిదా పడిన నేపథ్యంలో మార్క్ ఆంటోనీకి మంచి అవకాశం దొరికిందని సంబరపడుతున్న టైంలో సడన్ గా వచ్చిన ఈ ట్విస్ట్ కన్ఫ్యూజన్ రేపిన మాట వాస్తవం. విశాల్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ప్రస్తుతానికి రాలేదు.
టీమ్ యథాతధంగా ప్రమోషన్లు చేసుకుంటోంది. తెలుగులోనూ ఈవెంట్ తో పాటు మీడియా ప్రెస్ మీట్లకు ప్లాన్ చేస్తున్నారు. అందివచ్చిన ఈ ఛాన్స్ ని పూర్తిగా వాడుకునేందుకు విశాల్ చాలా ఉత్సాహంతో ఉన్నాడు. ట్రైలర్ చూశాక ఇదేదో వెరైటీ మాఫియా డ్రామాగా గుర్తించిన ప్రేక్షకుల్లో మెల్లగా ఆసక్తి పెరుగుతోంది. మునుపటి మార్కెట్ లేకపోయినా సరైన హిట్టు ఒకటిపడితే జనాన్ని థియేటర్ కు రప్పించే ఇమేజ్ అయితే విశాల్ కు ఇప్పటికీ ఉంది. ఎస్జె సూర్య స్నేహితుడిగా నటించిన ఈ టైం ట్రావెల్ డ్రామాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. హీరో గెటప్స్ చాలా వెరైటీగా ఉన్నాయి.
This post was last modified on September 8, 2023 11:10 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…