Movie News

బేబీ హీరోకి గణేషుడి దీవెనలు అందేనా

ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో  హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా పరిచయమయ్యాడు. తర్వాత చకచకా సినిమాలు చేశాడు. కానీ ‘బేబీ’ తర్వాత ఆనంద్ పేరుకి ముందు వినిపించే విజయ్ దేవరకొండ పేరు తొలగిపోయింది. 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఈ సినిమాతో ఆనంద్ కి కొత్త గుర్తింపు వచ్చేసింది. ఈ సినిమా టైమ్ లోనే ‘గం గం గణేశా’ అనే మరో కాన్సెప్ట్ సినిమా చేశాడు ఆనంద్. 

 ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. నవంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను సమంతతో సోషల్ మీడియాలో రిలీజ్ చేయిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆనంద్ మాస్ కేరెక్టర్ చేస్తున్నాడు. ఎంటర్టైన్ మెంట్ తో పాటు యాక్షన్ కూడా ఉండబోతుందట. ఇప్పుడు బేబీ సక్సెస్ ఆ సినిమాకి అడ్వాంటేజ్ అవ్వబోతుంది.

‘బేబీ’బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇంకా వేగం పెంచబోతున్నాడు ఆనంద్. ఇప్పటికే రెండు మూడు స్టోరీస్ లాక్ చేసి నెక్స్ట్ లైనప్ సెట్ చేసేసుకున్నాడు. అందులో ఒకటి తెలుగు , తమిళ్ బై లింగ్వెల్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది. మరి బేబీ సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆనంద్ ఇకపై ఎలాంటి విజయాలు అందుకుంటాడో ? తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.

Satya

Recent Posts

బోరింగ్ అన్నారు… కోట్లు ఇచ్చేస్తున్నారు

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…

46 minutes ago

అడ్రస్ లేని సినిమా గురించి మెగా హీరో ఏమన్నాడు?

సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…

1 hour ago

బంగారం లాంటి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది

పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…

2 hours ago

మరి సురేందర్ రెడ్డి సంగతేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…

3 hours ago

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

4 hours ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

6 hours ago