Movie News

హిందీ ప్రేక్షకుల కరవు.. షారుఖ్‌కి వరం

హిందీ ప్రేక్షకుల అభిరుచి గత కొన్నేళ్లలో చాలా మారిపోయింది. ఇదంతా సౌత్ సినిమాల పుణ్యమే అని చెప్పాలి. అప్పటిదాకా క్లాస్ సినిమాలకే ఎక్కువ పట్టం కట్టేవాళ్లు హిందీ ఆడియన్స్. మాస్, యాక్షన్ టచ్ ఉన్న సినిమాల్లో కూడా ఎలివేషన్లు మరీ ఎక్కువగా ఉండేవి కావు. హీరో ఎంట్రీ దగ్గర్నుంచి కూడా అన్ని విషయాల్లోనూ ఒక గిరి గీసుకుని కూర్చునేవాళ్లు అక్కడి ఫిలిం మేకర్స్.

కానీ ‘బాహుబలి’ దగ్గర్నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో ఉన్న మజా ఏంటో హిందీ ఆడియన్స్‌కు అర్థమైంది. హీరో ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలతో ప్రేక్షకుల్లో ఎలా గూస్ బంప్స్ తీసుకురావచ్చో మన దర్శకులు చూపించారు. యూట్యూబ్‌లో సౌత్ మసాలా సినిమాలకు బాగా అలవాటై.. క్లాస్‌గా, హడావుడి లేకుండా సాగిపోయే హిందీ సినిమాలు రుచించని పరిస్థితి తలెత్తింది. దీంతో బాలీవుడ్ సినిమాల శైలి కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది.

ఐతే ఈ శైలిని అందరు బాలీవుడ్ డైరెక్టర్లూ అడాప్ట్ చేసుకోలేకపోయాడు. షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ తీసిన సిద్దార్థ్ ఆనంద్ మాత్రం మారిన హిందీ ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకున్నాడు. సౌత్ స్టైల్‌ను బాగానే నేర్చుకున్నాడు. ఎలివేషన్లు, గూస్ బంప్స్ మూమెంట్స్‌తో ‘పఠాన్’ను నింపాడు. అది అద్భుతమైన ఫలితాన్నిచ్చింది.

ఇప్పుడు షారుఖ్.. నేరుగా సౌత్ డైరెక్టర్ అయిన అట్లీ‌తోనే జట్టు కట్టాడు కాబట్టి మరో మసాలా సినిమా అందించగలిగాడు. బాలీవుడ్ స్టార్లు ఇలాంటి సినిమాలు చేస్తే చూడాలని కరవులో ఉన్న హిందీ ఆడియన్స్ వరుసగా రెండో షారుఖ్ చిత్రానికి కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ‘జీరో’ సినిమా టైంకి ఎలాంటి చిత్రాలు చేయాలో తెలియని అయోమయంలో ఉన్న షారుఖ్.. ఇలా వరుసగా రెండు భారీ బ్లాక్‌బస్టర్లు ఇవ్వడం బాలీవుడ్ వాళ్లకే మింగుడు పడటం లేదు. ఇకపై బాలీవుడ్ స్టార్లందరూ ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ల వెంట పడితే ఆశ్చర్యం లేదు. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏమిటో నితిన్ ధైర్యం?

అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మ‌స్‌కు అనుకున్న ఆ చిత్రం…

1 hour ago

బిగ్ డే : తండేల్ మీదే అందరి కళ్ళు

నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…

3 hours ago

‘పట్టు’ లేదని ముందే తెలుసుకున్నారా

ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…

11 hours ago

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో…

14 hours ago

ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం.. సీఎం రేవంత్ ప్లాన్‌

'ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన…

15 hours ago

బాస్ ఈజ్ బాస్ : విశ్వక్ సేన్

వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…

15 hours ago