హిందీ ప్రేక్షకుల అభిరుచి గత కొన్నేళ్లలో చాలా మారిపోయింది. ఇదంతా సౌత్ సినిమాల పుణ్యమే అని చెప్పాలి. అప్పటిదాకా క్లాస్ సినిమాలకే ఎక్కువ పట్టం కట్టేవాళ్లు హిందీ ఆడియన్స్. మాస్, యాక్షన్ టచ్ ఉన్న సినిమాల్లో కూడా ఎలివేషన్లు మరీ ఎక్కువగా ఉండేవి కావు. హీరో ఎంట్రీ దగ్గర్నుంచి కూడా అన్ని విషయాల్లోనూ ఒక గిరి గీసుకుని కూర్చునేవాళ్లు అక్కడి ఫిలిం మేకర్స్.
కానీ ‘బాహుబలి’ దగ్గర్నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో ఉన్న మజా ఏంటో హిందీ ఆడియన్స్కు అర్థమైంది. హీరో ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలతో ప్రేక్షకుల్లో ఎలా గూస్ బంప్స్ తీసుకురావచ్చో మన దర్శకులు చూపించారు. యూట్యూబ్లో సౌత్ మసాలా సినిమాలకు బాగా అలవాటై.. క్లాస్గా, హడావుడి లేకుండా సాగిపోయే హిందీ సినిమాలు రుచించని పరిస్థితి తలెత్తింది. దీంతో బాలీవుడ్ సినిమాల శైలి కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది.
ఐతే ఈ శైలిని అందరు బాలీవుడ్ డైరెక్టర్లూ అడాప్ట్ చేసుకోలేకపోయాడు. షారుఖ్ ఖాన్తో ‘పఠాన్’ తీసిన సిద్దార్థ్ ఆనంద్ మాత్రం మారిన హిందీ ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకున్నాడు. సౌత్ స్టైల్ను బాగానే నేర్చుకున్నాడు. ఎలివేషన్లు, గూస్ బంప్స్ మూమెంట్స్తో ‘పఠాన్’ను నింపాడు. అది అద్భుతమైన ఫలితాన్నిచ్చింది.
ఇప్పుడు షారుఖ్.. నేరుగా సౌత్ డైరెక్టర్ అయిన అట్లీతోనే జట్టు కట్టాడు కాబట్టి మరో మసాలా సినిమా అందించగలిగాడు. బాలీవుడ్ స్టార్లు ఇలాంటి సినిమాలు చేస్తే చూడాలని కరవులో ఉన్న హిందీ ఆడియన్స్ వరుసగా రెండో షారుఖ్ చిత్రానికి కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ‘జీరో’ సినిమా టైంకి ఎలాంటి చిత్రాలు చేయాలో తెలియని అయోమయంలో ఉన్న షారుఖ్.. ఇలా వరుసగా రెండు భారీ బ్లాక్బస్టర్లు ఇవ్వడం బాలీవుడ్ వాళ్లకే మింగుడు పడటం లేదు. ఇకపై బాలీవుడ్ స్టార్లందరూ ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ల వెంట పడితే ఆశ్చర్యం లేదు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…