Movie News

హిందీ ప్రేక్షకుల కరవు.. షారుఖ్‌కి వరం

హిందీ ప్రేక్షకుల అభిరుచి గత కొన్నేళ్లలో చాలా మారిపోయింది. ఇదంతా సౌత్ సినిమాల పుణ్యమే అని చెప్పాలి. అప్పటిదాకా క్లాస్ సినిమాలకే ఎక్కువ పట్టం కట్టేవాళ్లు హిందీ ఆడియన్స్. మాస్, యాక్షన్ టచ్ ఉన్న సినిమాల్లో కూడా ఎలివేషన్లు మరీ ఎక్కువగా ఉండేవి కావు. హీరో ఎంట్రీ దగ్గర్నుంచి కూడా అన్ని విషయాల్లోనూ ఒక గిరి గీసుకుని కూర్చునేవాళ్లు అక్కడి ఫిలిం మేకర్స్.

కానీ ‘బాహుబలి’ దగ్గర్నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో ఉన్న మజా ఏంటో హిందీ ఆడియన్స్‌కు అర్థమైంది. హీరో ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలతో ప్రేక్షకుల్లో ఎలా గూస్ బంప్స్ తీసుకురావచ్చో మన దర్శకులు చూపించారు. యూట్యూబ్‌లో సౌత్ మసాలా సినిమాలకు బాగా అలవాటై.. క్లాస్‌గా, హడావుడి లేకుండా సాగిపోయే హిందీ సినిమాలు రుచించని పరిస్థితి తలెత్తింది. దీంతో బాలీవుడ్ సినిమాల శైలి కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది.

ఐతే ఈ శైలిని అందరు బాలీవుడ్ డైరెక్టర్లూ అడాప్ట్ చేసుకోలేకపోయాడు. షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ తీసిన సిద్దార్థ్ ఆనంద్ మాత్రం మారిన హిందీ ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకున్నాడు. సౌత్ స్టైల్‌ను బాగానే నేర్చుకున్నాడు. ఎలివేషన్లు, గూస్ బంప్స్ మూమెంట్స్‌తో ‘పఠాన్’ను నింపాడు. అది అద్భుతమైన ఫలితాన్నిచ్చింది.

ఇప్పుడు షారుఖ్.. నేరుగా సౌత్ డైరెక్టర్ అయిన అట్లీ‌తోనే జట్టు కట్టాడు కాబట్టి మరో మసాలా సినిమా అందించగలిగాడు. బాలీవుడ్ స్టార్లు ఇలాంటి సినిమాలు చేస్తే చూడాలని కరవులో ఉన్న హిందీ ఆడియన్స్ వరుసగా రెండో షారుఖ్ చిత్రానికి కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ‘జీరో’ సినిమా టైంకి ఎలాంటి చిత్రాలు చేయాలో తెలియని అయోమయంలో ఉన్న షారుఖ్.. ఇలా వరుసగా రెండు భారీ బ్లాక్‌బస్టర్లు ఇవ్వడం బాలీవుడ్ వాళ్లకే మింగుడు పడటం లేదు. ఇకపై బాలీవుడ్ స్టార్లందరూ ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ల వెంట పడితే ఆశ్చర్యం లేదు. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

44 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

46 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago