హిందీ ప్రేక్షకుల అభిరుచి గత కొన్నేళ్లలో చాలా మారిపోయింది. ఇదంతా సౌత్ సినిమాల పుణ్యమే అని చెప్పాలి. అప్పటిదాకా క్లాస్ సినిమాలకే ఎక్కువ పట్టం కట్టేవాళ్లు హిందీ ఆడియన్స్. మాస్, యాక్షన్ టచ్ ఉన్న సినిమాల్లో కూడా ఎలివేషన్లు మరీ ఎక్కువగా ఉండేవి కావు. హీరో ఎంట్రీ దగ్గర్నుంచి కూడా అన్ని విషయాల్లోనూ ఒక గిరి గీసుకుని కూర్చునేవాళ్లు అక్కడి ఫిలిం మేకర్స్.
కానీ ‘బాహుబలి’ దగ్గర్నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో ఉన్న మజా ఏంటో హిందీ ఆడియన్స్కు అర్థమైంది. హీరో ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలతో ప్రేక్షకుల్లో ఎలా గూస్ బంప్స్ తీసుకురావచ్చో మన దర్శకులు చూపించారు. యూట్యూబ్లో సౌత్ మసాలా సినిమాలకు బాగా అలవాటై.. క్లాస్గా, హడావుడి లేకుండా సాగిపోయే హిందీ సినిమాలు రుచించని పరిస్థితి తలెత్తింది. దీంతో బాలీవుడ్ సినిమాల శైలి కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది.
ఐతే ఈ శైలిని అందరు బాలీవుడ్ డైరెక్టర్లూ అడాప్ట్ చేసుకోలేకపోయాడు. షారుఖ్ ఖాన్తో ‘పఠాన్’ తీసిన సిద్దార్థ్ ఆనంద్ మాత్రం మారిన హిందీ ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకున్నాడు. సౌత్ స్టైల్ను బాగానే నేర్చుకున్నాడు. ఎలివేషన్లు, గూస్ బంప్స్ మూమెంట్స్తో ‘పఠాన్’ను నింపాడు. అది అద్భుతమైన ఫలితాన్నిచ్చింది.
ఇప్పుడు షారుఖ్.. నేరుగా సౌత్ డైరెక్టర్ అయిన అట్లీతోనే జట్టు కట్టాడు కాబట్టి మరో మసాలా సినిమా అందించగలిగాడు. బాలీవుడ్ స్టార్లు ఇలాంటి సినిమాలు చేస్తే చూడాలని కరవులో ఉన్న హిందీ ఆడియన్స్ వరుసగా రెండో షారుఖ్ చిత్రానికి కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ‘జీరో’ సినిమా టైంకి ఎలాంటి చిత్రాలు చేయాలో తెలియని అయోమయంలో ఉన్న షారుఖ్.. ఇలా వరుసగా రెండు భారీ బ్లాక్బస్టర్లు ఇవ్వడం బాలీవుడ్ వాళ్లకే మింగుడు పడటం లేదు. ఇకపై బాలీవుడ్ స్టార్లందరూ ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ల వెంట పడితే ఆశ్చర్యం లేదు.
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…