ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కొత్తదనం ఉండదని.. రొటీన్ మాస్ మూవీసే తీస్తారని వేరే ఇండస్ట్రీల వాళ్లకు ఎంత చిన్న చూపు ఉండేదో తెలిసిందే. ముఖ్యంగా ఇటు బాలీవుడ్ వాళ్లు, అటు కోలీవుడ్ వాళ్లు మన సినిమాలను చులకనగా చూసేవారు. అక్కడి క్రిటిక్స్ అయితే మన సినిమాల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా రేంజే మారిపోయింది. ఓవైపు వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రాలు తీస్తూనే ఇంకో వైపు.. కమర్షియల్ సినిమాలను కొత్త పుంతలు తొక్కిస్తూ.. వేరే ఇండస్ట్రీలు అందుకోలేని స్థాయికి వెళ్లిపోయింది టాలీవుడ్.
అన్నీ అని కాదు కానీ.. మన సినిమాలు కొన్ని దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ఇదే సమయంలో హిందీ, తమిళ సినిమాల క్వాలిటీ నానాటికీ పడిపోతోంది. తెలుగు సినిమాల స్థాయిలో అక్కడి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందట్లేదు. ఈ నేపథ్యంలో ఏదైనా సినిమాకు కొంచెం బజ్ క్రియేట్ అయితే, పాజిటివ్ టాక్ వస్తే చాలు.. వాటిని అక్కడి క్రిటిక్స్ మామూలుగా లేపట్లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాలను చూసి రొటీన్, రొడ్డకొట్టుడు అన్న వాళ్లే.. ఇప్పుడు తమ భాషల్లో అలాంటి సినిమాలు వస్తే వాటిని నెత్తి మీద పెట్టుకుంటున్నారు.
4 ప్లస్ రేటింగ్స్ ఇచ్చి ఆహా ఓహో అని కొనియాడుతున్నారు. తాజాగా రిలీజైన ‘జవాన్’ సంగతే చూద్దాం. సౌత్ ఇండియాలో వచ్చిన పాత సినిమాలను అటు ఇటు తిప్పి మంచి కమర్షియల్ ప్యాకేజీలు అందిస్తాడని పేరున్న తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్’ విషయంలోనూ అదే చేశాడు. కంటెంట్ పరంగా చూస్తే ‘జవాన్’ యావరేజ్ అనడంలో సందేహం లేదు.
ఈ చిత్రానికి మన క్రిటిక్స్ కంటెంట్కు తగ్గట్లే 2.5, 2.75 రేటింగ్స్ ఇచ్చారు. కానీ బాలీవుడ్ క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు మాత్రం 4, 4.5 రేటింగ్స్ ఇచ్చి ఈ చిత్రాన్ని జిజాంటిక్ బ్లాక్బస్టర్ లాంటి పదాలతో కొనియాడుతున్నారు. ఇది తమిళ దర్శకుడు తీసిన సినిమా కావడం వల్ల తమిళ క్రిటిక్స్ కూడా 3.5, 4 రేటింగ్స్ ఇచ్చి ప్రశంసలు కురిపిస్తున్నారు. కంటెంట్ పరంగా చూస్తే 3 రేటింగ్ కూడా ఎక్కువ అయిన సినిమాకు వీళ్లు ఇస్తున్న ఎలివేషన్ చూసి తెలుగు ప్రేక్షకులకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
This post was last modified on September 8, 2023 4:20 pm
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…