ఊహించిన దానికన్నా భారీగా ఫస్ట్ డే జవాన్ ఊచకోత మాములుగా జరగలేదు. దేశమంతా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ షాక్ ఇచ్చేలా సాగగా సాయంత్రం ఆటలు, సెకండ్ షోలకు ప్రధాన కేంద్రాలన్నీ హౌస్ ఫుల్స్ తో కిక్కిరిసిపోయాయి. తక్కువ బడ్జెట్ లో తీసినా మాస్ నచ్చే అంశాలు ఉండటంతో గదర్ 2కే అయిదు వందల కోట్లు కుమ్మరించిన ప్రేక్షకులు ఏకంగా షారుఖ్ ఖాన్ ని డ్యూయల్ రోల్ విశ్వరూపం చూపిస్తే ఆగుతారా. అదే నిన్న కలెక్షన్లలో ప్రతిబింబించింది. గురువారం విడుదల కావడంతో లాంగ్ వీక్ ని కలుపుకుని రికార్డులను పాతరేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అన్ని వెర్షన్లు కలిపి నిన్న జవాన్ సుమారు 75 కోట్ల దగ్గరగా వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఒక్క హిందీ నుంచే 60 కోట్ల 70 లక్షలు రాగా, తెలుగు 6 కోట్ల 40 లక్షలు, తమిళం 5 కోట్ల 50 లక్షలకు పైనే లెక్క వచ్చిందని ప్రాధమిక సమాచారం. కనీసం 26 లక్షల 90 వేల టికెట్లు అధికారికంగా అమ్ముడుపోయాయట. వీటిలో బ్లాక్ లో అమ్మినవి కలపలేదు. మహారాష్ట్ర. మధ్యప్రదేశ్, బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో సింగల్ స్క్రీన్ థియేటర్లలో వందలాది ఆడియన్స్ కింద కూర్చుని చూశారు. అవి కౌంట్ లోకి రావు. ఒకవేళ ఇవి కలిపితే ఈ నెంబర్ ఇంకా మతిపోయేలా ఉంటుందట.
పఠాన్ మొదటి రోజుని పెద్ద మార్జిన్ తో దాటేసిన జవాన్ కు పోటీ లేకపోవడం బాగా కలిసి వస్తోంది. తెలుగు తమిళంలో రిలీజులు ఉన్నప్పటికీ వాటికి యునానిమస్ గా మాస్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడంతో జనాలు జవాన్ నే మొదటి ఛాయస్ గా పెట్టుకున్నారు. ఇవాళ కొంత స్లో ఉన్నప్పటికీ కౌంటర్ బుకింగ్స్ తో ఫుల్స్ పడుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఫుల్ రన్ లో ఏవి క్రాస్ చేస్తుందో ఇప్పుడే చెప్పలేం కానీ దగ్గర్లో మరో బాలీవుడ్ మూవీ లేకపోవడంతో కనీసం రెండు మూడు వారాల పాటు షారుఖ్ వీర విహారం కన్ఫర్మ్ అయినట్టే. చాలా చోట్ల అదనంగా స్క్రీన్లు తోడవుతున్నాయి.
This post was last modified on September 8, 2023 11:56 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…