మహేష్ బాబు బావ, కృష్ణ అల్లుడు అనే గుర్తింపుతోనే చాన్నాళ్ల సినిమాలు చేసిన సుధీర్ బాబు.. సమ్మోహనం దగ్గర్నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో సాగిపోతున్నాడు. ఐతే సరైన కమర్షియల్ సక్సెస్ కోసం చూస్తున్న సుధీర్కు ఆ ఆశే తీరట్లేదు. శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్.. ఇలా వరుసగా సుధీర్ సినిమాలు నిరాశ పరిచాయి. వీటి తర్వాత అతడి నుంచి వస్తున్న సినిమా మామామశ్చీంద్ర.
నటుడు, రైటర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ అన్నీ కూడా వైవిధ్యంగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఐతే ఇంట్రెస్టింగ్ టీజర్ తర్వాత ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. కొన్ని నెలల నుంచి సైలెంట్గా ఉంది చిత్ర బృందం. ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయారు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి రిలీజ్ డేట్ అప్డేట్తో ప్రేక్షకులను పలకరించింది మామా మశ్చీంద్ర టీం. ఈ చిత్రాన్ని అక్టోబరు 6న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల చివరి వారంలో చాలా సినిమాలు రిలీజవుతుండగా.. ఆ తర్వాత, దసరాకు మధ్యలో పెద్దగా డిమాండ్ లేదు.
ఆ టైం చూసి మామా మశ్చీంద్రను రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే సుధీర్ సినిమాకు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. ఇప్పటికే హర్షవర్ధన్ ఓ సినిమాను డైరెక్ట్ చేయగా.. అది విడుదలకు నోచుకోలేదు. ఈసారి ఒక వెరైటీ కథతో అతను సినిమా తీశాడు. ఈ సినిమాలో సుధీర్ రకరకాల అవతారాల్లో కనిపించనున్నాడు. ముఖ్యంగా బొద్దుగా ఉన్న లుక్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. మరి సుధీర్కు ఈ సినిమా అయినా కోరుకున్న సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
This post was last modified on September 7, 2023 9:55 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…