ఖుషి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ నిన్న వైజాగ్ లో జరిగిన సక్సెస్ ఈవెంట్ లో వంద కుటుంబాలకు కలిపి కోటి రూపాయలను పంచాలని నిర్ణయించుకున్నానని వేదిక మీద ప్రకటించడం పెద్ద చర్చకే దారి తీసింది. ఇది పూర్తిగా సద్దుదేశంతో చెప్పినదే అయినా కొంత పాజిటివ్ గా ఇంకో వర్గంలో నెగటివ్ గా వెళ్తోంది. నిన్న ఇచ్చిన మాట ప్రకారం విజయ్ టీమ్ ఒక గూగుల్ ఫార్మ్ తయారు చేసి ఎవరికైతే లక్ష రూపాయలు అవసరమని భావిస్తున్నారో వాళ్ళ వివరాలు తీసుకుని టీమ్ ద్వారా వెరిఫై చేయించి ఆ తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి ఎవరికి సహాయం అందాలో నిర్ణయం తీసుకుంటారు.
దీనికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కం ప్రొడక్షన్ కంపనీ అభిషేక్ పిక్చర్స్ స్పందించింది. గతంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ని పంపిణి చేయడం ద్వారా తమకు 8 కోట్ల నష్టం వచ్చిందని, ఇప్పుడు సహృదయంతో కుటుంబాలకు ఎలాగైతే కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారో అలాగే మమల్ని మా బయ్యర్లను కాపాడతారని ఆశిస్తున్నామని ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. నిర్మాత కెఎస్ రామరావు తీసిన ఈ డిజాస్టర్ వల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని పలు ఇంటర్వ్యూలలో అభిషేక్ నామా గతంలోనే చెప్పారు. ఇప్పుడిలా పబ్లిక్ గా అడిగేసి షాక్ ఇచ్చారు.
దీనికి విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఎవరో చిన్నా చితకా డిస్ట్రిబ్యూటర్ అయితే ఏదో అనుకోవచ్చు. ఆ మధ్య రవితేజతో రావణాసుర, త్వరలో కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ చేయబోతున్న అభిషేక్ పిక్చర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీలో చర్చకు వస్తుంది. ట్వీట్ ఉంచుతారా లేక ఇండస్ట్రీ పెద్దల సలహా మేరకు డిలీట్ చేస్తారా అనేది తెలియదు కానీ అభిషేక్ అడిగిన దాంట్లో లాజిక్ ఉంది. కాకపోతే నిర్మాణంతర వ్యవహారాలు ప్రొడ్యూసర్ కు సంబంధించినవి. హీరో ప్రమేయం ఒక పరిధి వరకే ఉంటుంది. ఈ పరిణామం ఎటు మలుపు తిరుగుతుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు
This post was last modified on September 6, 2023 8:29 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…