జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందుతున్న దేవర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. బ్రేకులు లేకుండా పక్కా ప్లానింగ్ తో ఇద్దరూ సమన్వయపరుచుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు . హీరోయిన్ జాన్వీ కపూర్ కు సంబంధించిన కీలక భాగం ఈ నెలాఖరులోగా మొదలుపెట్టి త్వరగా పూర్తి చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు. విలన్ సైఫ్ అలీ ఖాన్ సైతం క్రమం తప్పకుండ డేట్లు ఇస్తూ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఇక దేవరకు సంబందించిన ఒక ముఖ్యమైన లీకు ఆడియన్స్ కి ఉత్సుకత రేపి ఆసక్తి పెంచేలా ఉంది.
దాని ప్రకారం దేవరలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకంగా నిలవబోతోంది. తారక్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వార్త ముందు నుంచి అది కానీ అధికారిక ధ్రువీకరణ లేదు. తండ్రి పాత్రలో జూనియర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, దానికి సంబంధించిన లీడ్ తో రెండో ఎన్టీఆర్ ని మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని వినిపిస్తోంది. అయితే బాహుబలి తరహాలో ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఛాన్స్ లేదని అంటున్నారు. కథలో చాలా స్కోప్ ఉండటంతో రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా కొరటాల బృందంలో ఉన్నట్టు వినిపిస్తోంది.
ఎలాగూ దేవర తర్వాత తారక్ కు బ్రేక్ వస్తుంది. వార్ 2 డిసెంబర్ లో మొదలుపెట్టొచ్చు. దాని రిలీజ్ 2025లో. సలార్ ఒక్క భాగానికే కిందా మీద అయిపోతున్న ప్రశాంత్ నీల్ తనకు వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తాడా లేక దాని సీక్వెల్ ని పూర్తి చేసి అప్పుడు తన స్క్రిప్ట్ పని చూస్తాడా అనే దాని మీద జూనియర్ కు సరైన క్లారిటీ లేదట. దీనివల్ల కొంత ఆలస్యం జరగొచ్చని అంటున్నారు. అదే జరిగితే ఫ్యాన్స్ కి గ్యాప్ అనిపించకుండా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 మొదటి భాగం, 2025లో సీక్వెల్ ప్లాన్ చేసుకుంటే ఏ లోటూ ఉండదు. క్షణాల్లో నిర్ణయాలు మారిపోతున్న పరిస్థితుల్లో ఏదీ ఖరారుగా చెప్పలేం.
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…
సుప్రీంకోర్టు హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో…
వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…