ఇదేదో దేవుడి ఉపమానంలా అనిపిస్తుంది కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విషయంలో హీరో నవీన్ చూపిస్తున్న డెడికేషన్ చూస్తుంటే మాత్రం ఈ పదమే కరెక్ట్ అనిపిస్తుంది. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రమోషన్లకు రాలేని నిస్సహాయత వ్యక్తం చేసిన తరుణంలో భారం మొత్తం ఒక్కడి మీదే పడింది. పైగా మూవీలో ఇతరత్రా స్టార్ అట్రాక్షన్ ఏదీ లేదు. సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళ బొమ్మ చూసి ఆడియన్స్ థియేటర్లకు వచ్చేంత సీన్ లేదు. సో ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు కథానాయకుడిగా తానొక్కడే సెల్లింగ్ పాయింటని అర్థం చేసుకున్న నవీన్ సర్వం తనే అయిపోయాడు.
ఏపీ తెలంగాణలో ఇప్పటికే విస్తృతంగా టూర్లు కొట్టేశాడు. నేరుగా ప్రేక్షకులను కలుసుకున్నాడు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా నిర్మాతలు ఎక్కడ ప్లాన్ చేస్తే అక్కడ అలుపు లేకుండా తిరిగాడు. ప్రెస్ మీట్ లో సైతం మైకు తీసుకుని రజనీకాంత్ రోబోలా అన్ని ప్రశ్నలకు జవాబిచ్చే బాధ్యతను తీసుకున్నాడు. సంగీతం పరంగానూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి ఛార్ట్ బస్టర్ లేదా వైరలయ్యే పాటలు పడలేదు. ఖుషి లాగా ఓ రెండు ట్రాక్స్ జనంలో రీచ్ అయ్యుంటే ఆడియన్స్ దృష్టి దీని మీద పడేది. కానీ ఆ ఛాన్స్ లేకపోయింది. ట్రైలర్ డీసెంట్ గా ఉండటం వల్ల అంచనాలొచ్చాయి.
దర్శకుడు మహేష్ బాబు ఒక డిఫరెంట్ పాయింట్ తో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తీసినట్టు ఇప్పటికైతే టాక్ ఉంది. సెప్టెంబర్ 7న డైనోసర్ లాంటి షారుఖ్ జవాన్ తో పోటీ ఉన్నప్పటికీ వేరే ఆప్షన్ లేక యువి క్రియేషన్స్ క్లాష్ కి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు వాయిదాలు జరిగిన నేపథ్యంలో మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఇబ్బందే కనక ఈ డేట్ కి కట్టుబడిపోయారు. అనుష్క మినహా నవీన్ పోలిశెట్టితో పాటు టీమ్ మొత్తం కలిసి చిరంజీవి సినిమా చూశాక బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మెగాస్టార్ వశిష్టల కాంబో మూవీని తెరకెక్కిస్తోంది యువినే కాబట్టి ఆ బాండింగ్ తో షో వేసి మరీ మెచ్చుకోలు అందుకున్నారు.
This post was last modified on September 5, 2023 1:38 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…