ఇదేదో దేవుడి ఉపమానంలా అనిపిస్తుంది కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విషయంలో హీరో నవీన్ చూపిస్తున్న డెడికేషన్ చూస్తుంటే మాత్రం ఈ పదమే కరెక్ట్ అనిపిస్తుంది. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రమోషన్లకు రాలేని నిస్సహాయత వ్యక్తం చేసిన తరుణంలో భారం మొత్తం ఒక్కడి మీదే పడింది. పైగా మూవీలో ఇతరత్రా స్టార్ అట్రాక్షన్ ఏదీ లేదు. సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళ బొమ్మ చూసి ఆడియన్స్ థియేటర్లకు వచ్చేంత సీన్ లేదు. సో ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు కథానాయకుడిగా తానొక్కడే సెల్లింగ్ పాయింటని అర్థం చేసుకున్న నవీన్ సర్వం తనే అయిపోయాడు.
ఏపీ తెలంగాణలో ఇప్పటికే విస్తృతంగా టూర్లు కొట్టేశాడు. నేరుగా ప్రేక్షకులను కలుసుకున్నాడు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా నిర్మాతలు ఎక్కడ ప్లాన్ చేస్తే అక్కడ అలుపు లేకుండా తిరిగాడు. ప్రెస్ మీట్ లో సైతం మైకు తీసుకుని రజనీకాంత్ రోబోలా అన్ని ప్రశ్నలకు జవాబిచ్చే బాధ్యతను తీసుకున్నాడు. సంగీతం పరంగానూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి ఛార్ట్ బస్టర్ లేదా వైరలయ్యే పాటలు పడలేదు. ఖుషి లాగా ఓ రెండు ట్రాక్స్ జనంలో రీచ్ అయ్యుంటే ఆడియన్స్ దృష్టి దీని మీద పడేది. కానీ ఆ ఛాన్స్ లేకపోయింది. ట్రైలర్ డీసెంట్ గా ఉండటం వల్ల అంచనాలొచ్చాయి.
దర్శకుడు మహేష్ బాబు ఒక డిఫరెంట్ పాయింట్ తో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తీసినట్టు ఇప్పటికైతే టాక్ ఉంది. సెప్టెంబర్ 7న డైనోసర్ లాంటి షారుఖ్ జవాన్ తో పోటీ ఉన్నప్పటికీ వేరే ఆప్షన్ లేక యువి క్రియేషన్స్ క్లాష్ కి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు వాయిదాలు జరిగిన నేపథ్యంలో మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఇబ్బందే కనక ఈ డేట్ కి కట్టుబడిపోయారు. అనుష్క మినహా నవీన్ పోలిశెట్టితో పాటు టీమ్ మొత్తం కలిసి చిరంజీవి సినిమా చూశాక బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మెగాస్టార్ వశిష్టల కాంబో మూవీని తెరకెక్కిస్తోంది యువినే కాబట్టి ఆ బాండింగ్ తో షో వేసి మరీ మెచ్చుకోలు అందుకున్నారు.
This post was last modified on September 5, 2023 1:38 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…