ఇటీవలే సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురైన కోలీవుడ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి వారసుడు, మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ మీద హిందూ సంఘాలు ఏ స్థాయిలో విరుచుపడుతున్నాయో చూస్తున్నాం. కొన్ని పోలీస్ కేసులు ఆల్రెడీ నమోదవ్వగా కొందరు ఏకంగా అతని తల మీద కోట్ల రూపాయల నజరానాలు ప్రకటిస్తున్నారు. దేశంలో మెజారిటీ వర్గం పాటించే ఒక ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులతో పోల్చడం ముమ్మాటికీ అభ్యంతకరమే. తాను వెనక్కు తగ్గనంటున్న స్టాలిన్ ఈ వివాదాన్ని ఇప్పట్లో ఆపేలా కనిపించడం లేదు.
ఇక్కడే షారుఖ్ ఖాన్ ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు. జవాన్ విడుదల ముంగిట ఉన్న నేపథ్యంలో స్వయంగా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ విజయం కోసం వేడుకుంటున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవలే వైష్ణో దేవి గుడికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న కింగ్ ఖాన్ ఇవాళ ఏడుకొండలపైన కొలువున్న వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు. తెల్లవారుఝామున టిటిడి నిర్దేశించిన సాంప్రదాయ దుస్తుల్లో సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. కూతురు సుహానా ఖాన్, హీరోయిన్ నయనతార, ఆవిడ భర్త విగ్నేష్ శివన్ షారుఖ్ తో పాటు పూజల్లో ఉన్నారు.
తాను ముస్లిం అయినప్పటికీ పరమత సహనాన్ని చక్కగా పాటించడమే కాక బిడ్డలకు కూడా నేర్పిస్తూ షారుఖ్ ఆదర్శంగా నిలుస్తుంటే స్టాలిన్ లాంటి వాళ్ళు సనాతనం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. ఈ పోలిక సందర్భోచితంగా ఉంది. సినిమా సక్సెస్ కోసమే అయినా షారుఖ్ ఇంత కష్టపడి పుణ్యక్షేత్రాలు తిరగాల్సిన పని లేదు. ఉన్న చోట మొక్కుకున్నా సరిపోతుంది. అలా కాకుండా స్వయంగా వెళ్లడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టాలిన్ వల్ల సన్ నెక్స్ట్ యాప్ జనం తీసేసే పనిలో ఉండగా షారుఖ్ వల్ల జవాన్ బుకింగ్స్ ఇంకా ఊపందుకునేలా ఉన్నాయి
This post was last modified on September 5, 2023 11:44 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…