గత నెల విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ ఫైనల్ రన్ కు వచ్చేసింది. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్ కౌంట్ మైంటైన్ చేసిన ఈ సూపర్ స్టార్ మూవీకి గురువారం నుంచి వీడ్కోలు తప్పదు. అదే రోజు అన్ని భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ జరగనుండటంతో ఇకపై టికెట్లు కొని చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ తో సన్ పిక్చర్స్ కి కనక వర్షం కురిపించిన జైలర్ అటు తమిళనాడు కేరళలోనూ ముగింపుకొచ్చింది. ఇక తెలుగు వెర్షన్ సంగతి చూస్తే సెలవు తీసుకునే సమయానికి వామ్మో అనిపించే లాభాలు కళ్లజూసింది.
వరల్డ్ వైడ్ తెలుగు జైలర్ అక్షరాలా 42 కోట్ల లాభాన్ని ఇచ్చింది. థియేట్రికల్ బిజినెస్ కేవలం 12 కోట్లకు చేయగా ఇంత మొత్తం వసూలు చేయడం ఎవరూ ఊహించనిది. వంద కోట్ల గ్రాస్ మార్కుకు కేవలం 2 కోట్ల దూరంలో ఆగిపోయిన సూపర్ స్టార్ దాన్ని అందుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం కానీ జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ది నన్ 2 విడుదల నేపథ్యంలో ఆ మాత్రం ఆశించడం కూడా కష్టమే అనిపిస్తోంది. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 2 కోట్ల దాకా షేర్ రాగా ఓవర్సీస్ లోనూ జైలర్ తెలుగు 5 కోట్లకు పైగా రాబట్టుకోవడం విశేషం. ఇవన్నీ కొత్త రికార్డులుగానే చెప్పుకోవాలి.
ఇకపై రజనీకాంత్ సినిమాలకు ఆటోమేటిక్ గా బిజినెస్ ఫిగర్స్ పెరిగిపోతాయి. ప్రత్యేక పాత్ర చేసిన లాల్ సలామ్ ని ఇరవై కోట్ల దాకా అడగొచ్చని చెన్నై టాక్. అయితే ప్రతిసారి జైలర్ లాంటి ఫలితాలే రిపీట్ కావు కాబట్టి బయ్యర్లు నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే గతంలో కేవలం రజని ఇమేజ్ నే గుడ్డిగా నమ్ముకుని కాలా, కబాలి, దర్బార్ లాంటి వాటి మీద కోట్లు కుమ్మరించిన నిర్మాతలు వాటి వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఏదైతేనేం రజనీకాంత్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ ని.
This post was last modified on September 5, 2023 12:29 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…