సినిమాల్లో నటన పరంగా అయినా.. స్టేజ్ మీద ప్రసంగాల విషయంలో అయినా.. సినిమాలను ప్రమోట్ చేసే తీరులో అయినా విజయ్ దేవరకొండ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. అతను ఏం మాట్లాడినా… ఏం చేసినా సెన్సేషన్ అవుతుంటుంది. గీత గోవిందం ప్రి రిలీజ్ ఈవెంట్లో తన మీద వచ్చిన ట్రోల్స్ను స్టేజ్ మీద ప్రదర్శింపజేయించినా.. ట్యాక్సీవాలా సినిమా ప్రమోషన్ కోసం థియేటర్కు వెళ్లి క్యాంటీన్ బిల్ అంతా తనే చెల్లించినా.. విజయ్కే చెల్లింది. ఇప్పుడు విజయ్ తన మార్కు సెన్సేషనల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు.
తన సంపాదనలో అభిమానులకు కూడా భాగం ఉందని పేర్కొంటూ.. వారి కోసం కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు విజయ్. ఈ మేరకు ఖుషి సక్సెస్ మీట్లో అతను ప్రకటన చేశాడు. తన ఎదుగుదలలో అభిమానుల పాత్రను గుర్తు చేస్తూ.. వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంటూ.. తన మీద ఇంత ప్రేమ చూపించే అభిమానులకు తన సంపాదనను పంచాలని నిర్ణయించుకున్నట్లు ఖుషి ఈవెంట్లో విజయ్ ప్రకటించాడు. అందుకే తన ఆదాయంలో కోటి రూపాయలు వారికి ఇవ్వనున్నట్లు తెలిపాడు.
వంద మంది అభిమానులను ఎంపిక చేసి వారి కుటుంబాలకు తలో లక్ష రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు విజయ్ వెల్లడించాడు. ఈ ఎంపిక ఎలా ఉంటుంది.. డబ్బులు ఎలా పంచుతారు అనే విషయాలను తన టీం చూసుకుంటుందని.. దాని వివరాలు తర్వాత వెల్లడిస్తానని విజయ్ పేర్కొన్నాడు. ఈ ప్రకటనకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. విజయ్ మాత్రమే ఇలా చేయగలడంటూ అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…