సినిమాల్లో నటన పరంగా అయినా.. స్టేజ్ మీద ప్రసంగాల విషయంలో అయినా.. సినిమాలను ప్రమోట్ చేసే తీరులో అయినా విజయ్ దేవరకొండ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. అతను ఏం మాట్లాడినా… ఏం చేసినా సెన్సేషన్ అవుతుంటుంది. గీత గోవిందం ప్రి రిలీజ్ ఈవెంట్లో తన మీద వచ్చిన ట్రోల్స్ను స్టేజ్ మీద ప్రదర్శింపజేయించినా.. ట్యాక్సీవాలా సినిమా ప్రమోషన్ కోసం థియేటర్కు వెళ్లి క్యాంటీన్ బిల్ అంతా తనే చెల్లించినా.. విజయ్కే చెల్లింది. ఇప్పుడు విజయ్ తన మార్కు సెన్సేషనల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు.
తన సంపాదనలో అభిమానులకు కూడా భాగం ఉందని పేర్కొంటూ.. వారి కోసం కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు విజయ్. ఈ మేరకు ఖుషి సక్సెస్ మీట్లో అతను ప్రకటన చేశాడు. తన ఎదుగుదలలో అభిమానుల పాత్రను గుర్తు చేస్తూ.. వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంటూ.. తన మీద ఇంత ప్రేమ చూపించే అభిమానులకు తన సంపాదనను పంచాలని నిర్ణయించుకున్నట్లు ఖుషి ఈవెంట్లో విజయ్ ప్రకటించాడు. అందుకే తన ఆదాయంలో కోటి రూపాయలు వారికి ఇవ్వనున్నట్లు తెలిపాడు.
వంద మంది అభిమానులను ఎంపిక చేసి వారి కుటుంబాలకు తలో లక్ష రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు విజయ్ వెల్లడించాడు. ఈ ఎంపిక ఎలా ఉంటుంది.. డబ్బులు ఎలా పంచుతారు అనే విషయాలను తన టీం చూసుకుంటుందని.. దాని వివరాలు తర్వాత వెల్లడిస్తానని విజయ్ పేర్కొన్నాడు. ఈ ప్రకటనకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. విజయ్ మాత్రమే ఇలా చేయగలడంటూ అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on September 5, 2023 12:26 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…