సినిమాల్లో నటన పరంగా అయినా.. స్టేజ్ మీద ప్రసంగాల విషయంలో అయినా.. సినిమాలను ప్రమోట్ చేసే తీరులో అయినా విజయ్ దేవరకొండ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. అతను ఏం మాట్లాడినా… ఏం చేసినా సెన్సేషన్ అవుతుంటుంది. గీత గోవిందం ప్రి రిలీజ్ ఈవెంట్లో తన మీద వచ్చిన ట్రోల్స్ను స్టేజ్ మీద ప్రదర్శింపజేయించినా.. ట్యాక్సీవాలా సినిమా ప్రమోషన్ కోసం థియేటర్కు వెళ్లి క్యాంటీన్ బిల్ అంతా తనే చెల్లించినా.. విజయ్కే చెల్లింది. ఇప్పుడు విజయ్ తన మార్కు సెన్సేషనల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు.
తన సంపాదనలో అభిమానులకు కూడా భాగం ఉందని పేర్కొంటూ.. వారి కోసం కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు విజయ్. ఈ మేరకు ఖుషి సక్సెస్ మీట్లో అతను ప్రకటన చేశాడు. తన ఎదుగుదలలో అభిమానుల పాత్రను గుర్తు చేస్తూ.. వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంటూ.. తన మీద ఇంత ప్రేమ చూపించే అభిమానులకు తన సంపాదనను పంచాలని నిర్ణయించుకున్నట్లు ఖుషి ఈవెంట్లో విజయ్ ప్రకటించాడు. అందుకే తన ఆదాయంలో కోటి రూపాయలు వారికి ఇవ్వనున్నట్లు తెలిపాడు.
వంద మంది అభిమానులను ఎంపిక చేసి వారి కుటుంబాలకు తలో లక్ష రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు విజయ్ వెల్లడించాడు. ఈ ఎంపిక ఎలా ఉంటుంది.. డబ్బులు ఎలా పంచుతారు అనే విషయాలను తన టీం చూసుకుంటుందని.. దాని వివరాలు తర్వాత వెల్లడిస్తానని విజయ్ పేర్కొన్నాడు. ఈ ప్రకటనకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. విజయ్ మాత్రమే ఇలా చేయగలడంటూ అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on September 5, 2023 12:26 am
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…