విజయ్ దేవరకొండ ఖుషి మొదటి వీకెండ్ ని ఘనంగా ముగించింది. వరల్డ్ వైడ్ 70 కోట్లకు పైగా గ్రాస్ తో మంచి ఫిగర్స్ నమోదు చేయగా యుఎస్ లో 1.4 మిలియన్ డాలర్లతో బ్రహ్మాండంగా దుమ్ము దులిపింది. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నైజామ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండగా సీడెడ్, ఆంధ్రలో అంత దూకుడు లేదు. అయినా సరే నిన్న ఆదివారం దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ బాగానే నమోదయ్యాయి. పోటీ లేని వాతావరణాన్ని ఖుషి బాగా వాడుకుంది. అందుకే హైదరాబాద్ కాకుండా వైజాగ్ లో సక్సెస్ మీట్ చేయాలనే తెలివైన నిర్ణయం తీసుకున్నారు మైత్రి మేకర్స్.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఖుషికి అసలు అగ్నిపరీక్ష ఈ రోజు అంటే సోమవారం నుంచి మొదలుకానుంది. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే వీక్ డేస్ లో డ్రాప్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అది మరీ తీవ్రంగా ఉండకపోవడం కీలకం. బేబీకి మండే కూడా సోల్డ్ అవుట్ బోర్డులు పడిన విషయం మర్చిపోకూడదు. ఖుషికి అంత యూనానిమస్ టాక్ వచ్చి ఉంటే అదే జరిగేది కానీ జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం వల్ల మెట్రో స్పీడ్ కు బదులు ఎక్స్ ప్రెస్ వేగంలో వెళ్తోంది. రేపు సాయంత్రానికి ఈ ట్రెండ్ మీద ఒక స్పష్టమైన అవగాహనకు రావొచ్చు.
ఇక ఈ వారం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వస్తోంది. విపరీతమైన హైప్ లేదు కానీ మార్నింగ్ షో టాక్ మీద ఆధారపడి నవీన్ పోలిశెట్టి ఒక్కడే ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. అనుష్క ఎందుకు రావడం లేదనే కారణం చూచాయగా తెలిసినా యూనిట్ నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. హైప్ తేవడంతో ట్రైలర్ కొంతవరకు మంచి పాత్రే పోషించింది కానీ ఇలాంటి వాటికి కీలకంగా పని చేయాల్సిన ఆడియోకి అంత రీచ్ రాలేదు. ఇక షారుఖ్ ఖాన్ జవాన్ బుకింగ్స్ మాత్రం అరాచకం అనిపించేలా జరుగుతున్నాయి. వీటి మధ్యలోనే ఖుషి పికప్ అందుకుని జోరు చూపించాల్సి ఉంటుంది.
This post was last modified on September 4, 2023 1:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…