Movie News

పైరసీ చేశారు 20 లక్షల ఫైన్ పడింది

ఇటీవలే సవరణలకు గురై కఠిన ఆంక్షలతో ముందుకొచ్చిన సినిమాటోగ్రఫీ యాక్ట్ లో మొదటి తీర్పు వచ్చేసింది. తాము హక్కులు కొనుగోలు చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివని పైరసీ చేసి ఇల్లీగల్ గా స్ట్రీమింగ్ చేసినందుకు గాను స్టార్ మా నెట్ వర్క్ కోర్టులో కేసు వేసింది. కొన్ని వెబ్ సైట్స్ ని బాధ్యులుగా పేర్కొంటూ ఆధారాలతో సహా న్యాయస్థానానికి సమర్పించింది. ఇవన్నీ పరిశీలించిన జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ సదరు మిర్రర్ సైట్లకు అక్షరాలా 20 లక్షల జరిమానా విధిస్తూ జడ్జ్ మెంట్ ఇచ్చేశారు. ముందు 18 సైట్లను పేర్కొన్న స్టార్ ఛానల్ తర్వాత మరికొన్నింటిని జోడించింది.

పైరసీ భూతం దశాబ్దాల తరబడి పరిశ్రమను వేధిస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దొరక్క నిర్మాతలు కోట్లలో నష్టపోతున్నారు. ఇటీవలే జైలర్ థియేటర్లలో రన్ అవుతుండగానే హెచ్డిని లీక్ చేయడంతో హఠాత్తుగా ఓటిటి స్ట్రీమింగ్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవే కాదు కొత్త రిలీజ్ ఏదున్నా సరే మార్నింగ్ షో పడ్డాక సాయంత్రం లోపు మంచి ప్రింట్ తో దాన్ని జనాలకు అందిస్తున్న సైట్లు వందల్లో ఉన్నాయి. విదేశీ సర్వర్ల ద్వారా వీటిని ఆపరేట్ చేయడంతో పట్టుకోవడం దుర్లభంగా మారింది. ఇప్పుడీ పరిణామంతో ఖచ్చితంగా మార్పు ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇలాంటి కేసుల్లో విజయం సాధించాలంటే నిర్మాతకు ఓపిక చాలా అవసరం. అధిక సందర్భాల్లో ఎలాగూ బిజినెస్ అయిపోయింది, డబ్బులు వచ్చేశాయనే నిర్లక్ష్యంతో చాలా మంది ముందుకు రారు. కానీ స్టార్ నెట్ వర్క్ మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. ఇదొక్కటే కాదు టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో కోట్లాది సినిమాలు ఉచితంగా పంపిణి చేసే వాళ్ళ భరతం కూడా పడితేనే ఈ చీడకు విరగడ ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ ఒక్క రోజులో నెలలో అవ్వకపోవచ్చు. సమయం పట్టినా చివరి పరిష్కారం వరకు పోరాడితే ఎందరికో మేలు జరుగుతుంది.

This post was last modified on September 4, 2023 8:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago