కలెక్షన్ల పరంగా రికార్డులంటే ఎప్పుడూ హీరోల గురించే చర్చ జరుగుతుంటుంది. హీరోల ఫ్యాన్స్ మధ్యే ఈ విషయంలో పోటీ కనిపిస్తుంటుంది. వాదోపవాదాలు నడుస్తుంటాయి. హీరోయిన్లను రికార్డుల విషయంలో అస్సలు కన్సిడర్ చేయరు. ఐతే రికార్డుల తాలూకు క్రెడిట్లో మేజర్ షేర్ హీరోయిన్లకు రాకపోవచ్చు కానీ.. వాళ్ల పాత్రా ఎంతో కొంత ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ కోణంలో చూస్తే సమంత సాధించిన ఓ రికార్డును ఇండియాలో మరే హీరోయిన్ కానీ.. హీరో కానీ కొట్టే పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు.
యుఎస్లో ఏకంగా 17 మిలియన్ డాలర్ మూవీస్లో సమంత భాగం కావడం విశేషం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీలో కూడా ఏ హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇన్నిసార్లు ఈ మార్కును అందుకోలేదు. తాజాగా ‘ఖుషి’ మూవీతో సామ్ మరోసారి ఈ క్లబ్బులోకి అడుగు పెట్టింది. టాలీవుడ్లో తొలి మిలియన్ డాలర్ మూవీ ‘దూకుడు’లో సమంతనే హీరోయిన్ కావడం విశేషం. ఆ తర్వాత ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి, 24, బ్రహ్మోత్సవం, అఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ.. ఇలా సామ్ నటించిన చాలా చిత్రాలు మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగు పెట్టాయి.
తాజాగా ‘ఖుషి’ విడుదలైన రెండు రోజులకే మిలియన్ డాలర్ మార్కును దాటేసింది. ‘అఆ’, ‘మజిలీ’ లాంటి చిత్రాల విజయంలో సమంత పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. తాజాగా ‘ఖుషి’లో కూడా సామ్ది ముఖ్య పాత్ర. సమంత నటించిన యుటర్న్, ఓ బేబీ, యశోద లాంటి కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా యుఎస్లో బాగా ఆడాయి. తెలుగులో సమంతలా ప్రేక్షకులను సొంతంగా థియేటర్లకు పుల్ చేసే స్థాయిని చాలా కొద్దిమంది హీరోయిన్లే అందుకున్నారు. కాకపోతే ‘ఖుషి’లో సామ్ లుక్స్, పెర్ఫామెన్స్ విషయంలో ఏమంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావట్లేదు.
This post was last modified on September 3, 2023 5:19 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…