Allu Arjun
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. పుష్ప 2 ది రూల్ మీద ఒక్కసారిగా అంచనాలు ఇంకాస్త పైకెళ్ళాయి. రెండు పురస్కారాలు దక్కడంతో సుకుమార్ కూడా మరింత శ్రద్ధ సరైన ప్లానింగ్ తో ఉన్న స్క్రిప్ట్ ని మరింత పక్కాగా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. 2024 మార్చి 22 విడుదలనే లీక్ వచ్చింది కానీ ఆ డెడ్ లైన్ ఖచ్చితంగా చేరుకోవడం గురించి సుక్కు ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నారట. అందుకే అఫీషియల్ గా రిలీజ్ డేట్ గురించి ప్రకటించడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు.
మరి పుష్ప 2 తర్వాత ఎవరితో సినిమా అనే విషయంలో మొదటి ప్లేస్ ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఇదయ్యాక చేయాల్సిన సినిమా కూడా బన్నీ లాక్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. తమిళ దర్శకుడు ఆట్లీ చెప్పిన లైన్ నచ్చడంతో త్వరలోనే ఫైనల్ వెర్షన్ వినేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. బ్యానర్ గట్రా వివరాలు తెలియదు కానీ కమర్షియల్ జానర్ ని డీల్ చేయడంతో తనదంటూ ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న ఆట్లీ ఏకంగా షారుఖ్ ఖాన్ తో పిలుపందుకుని జవాన్ ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
దాని ఫలితం గురించి ఎలాగూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి అట్లీ వైపు బన్నీ సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టార్ హీరోలు తమ దర్శకుల కాంబోలను చాలా అడ్వాన్స్ గా లాక్ చేసుకునే పరిస్థితులు ఉండటంతో త్రివిక్రమ్ తో పాటు అట్లీకి కమిట్ మెంట్ ఇచ్చేస్తే అల్లు అర్జున్ కు2025 వరకు మళ్ళీ ఆలోచించాల్సిన పని ఉండదు. ఇప్పటికే పలు బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు సంప్రదింపుల్లో ఉండగా హిందీ డెబ్యూ గురించి బన్నీ తొందరపడేలా లేడు. ఏదైనా సరే సౌత్ దర్శకులతో చేసి వాటినే ప్యాన్ ఇండియా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…