ఇంకో అయిదు రోజుల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలవుతోంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్కని తెరమీద చూడబోతున్న అభిమానులు దీని మీద పెద్ద నమ్మకం పెట్టుకున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ హీరో నవీన్ పోలిశెట్టి అంతా తానై ఊరూరా తిరిగి ప్రమోషన్ చేస్తున్నాడు. అయితే ఉండాల్సిన రేంజ్ లో హైప్ లేదనే విషయం సోషల్ మీడియా ట్రెండ్స్ చూసినా అర్థమవుతుంది. మీడియా, అభిమానుల ముందుకు రావడానికి అనుష్క ఇష్టపడకపోవడం వల్ల భారం మొత్తం నవీన్ మోయాల్సి వచ్చింది. వీళ్లిద్దరు తప్ప ఇంకే అట్రాక్షన్ ఈ సినిమాకు లేదనేది నిజం.
ఇంత తక్కువ టైం ఉన్నప్పుడు పబ్లిసిటీ స్పీడ్ పెంచాలి. జనంలో ఆసక్తి కలిగేలా హంగామా జరగాలి. కేవలం ఒకటి రెండు ఇంటర్వ్యూలతో పనవ్వదు. అసలే అవతల పోటీలో షారుఖ్ ఖాన్ జవాన్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో కళ్ళముందు కనిపిస్తోంది. హిందీ సినిమా అయినా సరే తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ ఇస్తుండటంతో సాధారణ ప్రేక్షకులు సైతం చూడొచ్చనే ప్లాన్ లో ఉన్నారు. అలాంటప్పుడు దాని మీద దృష్టిని తనవైపు మళ్ళించుకోవడం మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టికి అంత సులభంగా ఉండదు.
ఒక డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో భర్త లేకుండా పిల్లల్ని కోరుకునే పాత్రలో అనుష్క, జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకునే స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి విభిన్నమైన పాత్రలే చేశారు. అసలే సెప్టెంబర్ 15న స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ లాంటివి ఉన్నాయి. వాటికి ధీటుగా రెండో వారం కొనసాగాలంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికికి బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. దానికన్నా ఎం ముందు మంచి ఓపెనింగ్స్ దక్కాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది ఏదో ఉందన్నారు కానీ ఇంకా డీటెయిల్స్ రాలేదు. విడుదల దగ్గరగా ఉన్న తరుణంలో శెట్టి జంట అర్జెంటుగా స్పీడ్ పెంచాల్సిందే.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…