ఇంకో అయిదు రోజుల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలవుతోంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్కని తెరమీద చూడబోతున్న అభిమానులు దీని మీద పెద్ద నమ్మకం పెట్టుకున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ హీరో నవీన్ పోలిశెట్టి అంతా తానై ఊరూరా తిరిగి ప్రమోషన్ చేస్తున్నాడు. అయితే ఉండాల్సిన రేంజ్ లో హైప్ లేదనే విషయం సోషల్ మీడియా ట్రెండ్స్ చూసినా అర్థమవుతుంది. మీడియా, అభిమానుల ముందుకు రావడానికి అనుష్క ఇష్టపడకపోవడం వల్ల భారం మొత్తం నవీన్ మోయాల్సి వచ్చింది. వీళ్లిద్దరు తప్ప ఇంకే అట్రాక్షన్ ఈ సినిమాకు లేదనేది నిజం.
ఇంత తక్కువ టైం ఉన్నప్పుడు పబ్లిసిటీ స్పీడ్ పెంచాలి. జనంలో ఆసక్తి కలిగేలా హంగామా జరగాలి. కేవలం ఒకటి రెండు ఇంటర్వ్యూలతో పనవ్వదు. అసలే అవతల పోటీలో షారుఖ్ ఖాన్ జవాన్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో కళ్ళముందు కనిపిస్తోంది. హిందీ సినిమా అయినా సరే తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ ఇస్తుండటంతో సాధారణ ప్రేక్షకులు సైతం చూడొచ్చనే ప్లాన్ లో ఉన్నారు. అలాంటప్పుడు దాని మీద దృష్టిని తనవైపు మళ్ళించుకోవడం మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టికి అంత సులభంగా ఉండదు.
ఒక డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో భర్త లేకుండా పిల్లల్ని కోరుకునే పాత్రలో అనుష్క, జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకునే స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి విభిన్నమైన పాత్రలే చేశారు. అసలే సెప్టెంబర్ 15న స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ లాంటివి ఉన్నాయి. వాటికి ధీటుగా రెండో వారం కొనసాగాలంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికికి బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. దానికన్నా ఎం ముందు మంచి ఓపెనింగ్స్ దక్కాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది ఏదో ఉందన్నారు కానీ ఇంకా డీటెయిల్స్ రాలేదు. విడుదల దగ్గరగా ఉన్న తరుణంలో శెట్టి జంట అర్జెంటుగా స్పీడ్ పెంచాల్సిందే.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…