సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ నెల రోజులు తిరక్కుండానే ఓటిటిలో వచ్చేస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 10న రిలీజైన ఇంత పెద్ద హిట్టు సినిమాని త్వరగా డిజిటల్ విడుదల చేయడానికి కారణం లేకపోలేదు. ఇటీవలే జైలర్ హెచ్డి వెర్షన్ ఆన్ లైన్ లో లీకైపోయింది. ఒరిజినల్ డాల్బీ సౌండ్ తో అదిరిపోయే క్లారిటీతో ఉన్న ప్రింట్ చూసి అందరూ షాక్ తిన్నారు. ఇది విస్తృతంగా వైరల్ కావడంతో దాని ప్రభావం ఏకంగా థియేటర్ రెవిన్యూ మీద కూడా పడింది. దీంతో డేట్ లాక్ చేశారు.
ట్విస్టు ఏంటంటే జైలర్ నిర్మించింది సన్ పిక్చర్స్. వాళ్లకు స్వంతంగా ఓటిటి ఉంది. నెట్ ఫ్లిక్స్ తో టై అప్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయినా సరే అనూహ్యంగా ప్రైమ్ కి ఇవ్వడం షాక్ ఇచ్చేదే. సుమారు వంద కోట్లకు పైగా ఈ డీల్ జరిగినట్టుగా చెన్నై టాక్. ఈ మొత్తం ముట్టడం వల్లే నిర్మాత దయానిధి మారన్ రజనీకాంత్ కు ప్రత్యేకంగా ఒక చెక్కు, ఖరీదైన కారుతో పాటు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు గిఫ్ట్ ఇచ్చినట్టు చెన్నై టాక్. ఈ వారంలోనే అనిరుద్ రవిచందర్ తో పాటు విలన్ వినాయకన్ కు సైతం కానుకలు ముట్టజెప్పబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
అభిమానులు ఒకవైపు కలెక్షన్లు తగ్గుతాయనే బాధ పడుతూనే ఇంత త్వరగా జైలర్ ని చిన్నితెరపై చూసుకోవచ్చని సంబరపడుతున్నారు. అయినా బ్లాక్ బస్టర్లు సైతం నాలుగు వారాల గ్యాప్ ని నిలకడగా మెయింటైన్ చేయలేకపోతే ఇక చిన్న చిత్రాల సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. గత కొంత కాలంగా సౌత్ కంటెంట్ విషయంలో కొంచెం వెనుకబడి ఉన్న ప్రైమ్ కు జైలర్ నుంచి పెద్ద బూస్ట్ దక్కుతుందని అంచనాలున్నాయి. నెట్ ఫ్లిక్స్ తో పోటీ దృష్ట్యా రజనీకాంత్ మూవీ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు ఓటిటి వర్గాల కథనం.
This post was last modified on September 2, 2023 2:30 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…