జవాన్ ట్రైలర్ లో షారుఖ్ ఖాన్ ని చాలా అవతారాల్లో చూసేసరికి ఫ్యాన్స్ ఆనందంలో, ప్రేక్షకులు అయోమయంలో మునిగిపోయారు. ఊహించిన దానికన్నా పెద్ద బడ్జెట్ తో ఈ యాక్షన్ గ్రాండియర్ రూపొందటం చూసి షాక్ తిన్నారు. అయితే దీని కథ విషయంలో ముందు నుంచి ఇది కమల్ హాసన్ ఓరు ఖైతియిన్ డైరీ(తెలుగులో ఖైదీ వేట)కి ఫ్రీ మేక్ అనే ప్రచారం షూటింగ్ దశ నుంచే ఉంది. విజయ్ తేరిని కూడా దర్శకుడు అట్లీ తెలివిగా విజయ్ కాంత్ క్షత్రియుడు నుంచి తీసుకుని దాన్ని ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ కి అనుగుణంగా మార్చి హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే.
జవాన్ కు సైతం ఇదే ఫార్ములాని అనుసరించినట్టు అర్థమవుతోంది. అదెలాగో చూద్దాం. ట్రైలర్ లో చూపించిన ప్రకారం ఇది తండ్రి కొడుకుల కథ. నాన్న రివెంజ్ కు తెగబడితే కొడుకు ఖాకీ చొక్కా వేసుకుని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కమల్ మూవీలో తనకు అన్యాయం చేసిన వాళ్ళ అంతం చూసేందుకు హీరో శ్రీదేవిని కిడ్నాప్ చేస్తాడు. జవాన్ లో మెట్రో ట్రైన్ ని హైజాక్ చేసి డిమాండ్లు వినిపిస్తాడు. ఇది మొదటి మార్పు. ఒరిజినల్ వెర్షన్ ల తండ్రి పాత్ర ఓ మాములు పేద వ్యక్తి. షారుఖ్ ఖాన్ ఫ్లాష్ బ్యాక్ లో ఆర్మీలో పని చేసే టాప్ ఆఫీసర్ గా మార్చారు.
స్కేల్ ప్రకారం చూసుకుంటే జవాన్ ని వందల కోట్లతో తీస్తే అప్పట్లో ఖైదీ వేటని భారతిరాజా రీజనబుల్ బడ్జెట్ తో పూర్తి చేసి సంచలన విజయం అందుకున్నారు. ఒరిజినల్ లో ఇళయరాజా పాటలు, బిజిఎమ్ చాలా ప్లస్ అయ్యాయి. జవాన్ లో అనిరుద్ రవిచందర్ ఎలాంటి మేజిక్ చేశాడో థియేటర్లో చూడాలి. మొత్తానికి కాదనలేని కంపారిజన్లు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. యాక్షన్ ఓవర్ లోడ్ అయ్యిందనే కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపాక హైదరాబాద్ లో షారుఖ్ ని తీసుకొచ్చి మీడియా మీట్ చేసే ఆలోచనలో ప్రొడక్షన్ టీమ్ ఉంది.
This post was last modified on September 1, 2023 8:29 am
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…