Movie News

స్టువర్ట్ పురం వివాదాలు అప్పుడెందుకు రాలేదు

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు టీజర్ లో ఒక ఊరి మనోభావాలు దెబ్బ తీసేలా డైలాగులు, సన్నివేశాలు పెట్టారని ఒక పిల్ కు సమాధానంగా హై కోర్టు నోటీసులు జారీ చేయడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియాలోనూ వేడి చర్చ జరుగుతోంది. ఇదంతా స్టువర్ట్ పురం ఊరి గురించేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయస్థానం అడిగింది సహేతుకంగా ఉన్నా మూవీలో చూపిస్తోంది పీరియాడిక్ డ్రామా కాబట్టి అప్పట్లో జరిగిన దొంగతనాలు ఆధారంగా చేసుకునే దర్శకుడు వంశీ కథ రాసుకున్నట్టు పలు సందర్భాల్లో చెప్పాడు.

కాసేపు లాంగ్ ఫ్లాష్ బ్యాక్ కు వెళదాం. ముప్పై ఏళ్ళ క్రితం 1991లో చిరంజీవి హీరోగా యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ఆయనే రాసిన నవల ఆధారంగా స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ తీశారు. డిజాస్టరైన సంగతి పక్కన పెడితే అందులో ఆ ఊరిలో ఎలాంటి దొంగలు ఉండేవారో, ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో చూపించారు. అప్పుడూ కొన్ని అభ్యంతరాలు వచ్చాయి కానీ మరీ కోర్టు మెట్లు ఎక్కే దాకా కాదు. అదే టైంలో భానుచందర్ స్టువర్ట్ పురం దొంగలు సైతం ఇదే బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. చిరుతో పోలిస్తే ఇది మంచి ఫలితం అందుకుంది. దీన్నీ ఎవరూ తప్పుబట్టలేదు.

కానీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుకు అబ్జెక్షన్ వచ్చి పడింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని నిర్మాతకు నోటీసు వెళ్ళింది. యూట్యూబ్ ట్రైలర్ అయినా సరే సెన్సార్ ఎందుకు చేయించలేదని ప్రశ్నించింది. సరే లాయర్ ద్వారా ఎలాంటి సమాధానం చెబుతారో ఇంకొద్ది రోజుల్లో తేలుతుంది కానీ సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక ఇష్యూ ఎలాంటిదైనా సరే సున్నితత్వం పెరిగిపోయి మనోభావాలు బాగా దెబ్బ తింటున్నాయి. స్టువర్ట్ పురంలో ఇప్పుడెలాంటి విపత్కర పరిస్థితులు లేవు కానీ ఒకప్పుడు ఉన్నవే కదా చూపిస్తున్నారని అభిమానులు అంటున్నారు. చూడాలి కథ ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో.

This post was last modified on August 31, 2023 11:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

38 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

45 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago