Movie News

స్టువర్ట్ పురం వివాదాలు అప్పుడెందుకు రాలేదు

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు టీజర్ లో ఒక ఊరి మనోభావాలు దెబ్బ తీసేలా డైలాగులు, సన్నివేశాలు పెట్టారని ఒక పిల్ కు సమాధానంగా హై కోర్టు నోటీసులు జారీ చేయడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియాలోనూ వేడి చర్చ జరుగుతోంది. ఇదంతా స్టువర్ట్ పురం ఊరి గురించేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయస్థానం అడిగింది సహేతుకంగా ఉన్నా మూవీలో చూపిస్తోంది పీరియాడిక్ డ్రామా కాబట్టి అప్పట్లో జరిగిన దొంగతనాలు ఆధారంగా చేసుకునే దర్శకుడు వంశీ కథ రాసుకున్నట్టు పలు సందర్భాల్లో చెప్పాడు.

కాసేపు లాంగ్ ఫ్లాష్ బ్యాక్ కు వెళదాం. ముప్పై ఏళ్ళ క్రితం 1991లో చిరంజీవి హీరోగా యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ఆయనే రాసిన నవల ఆధారంగా స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ తీశారు. డిజాస్టరైన సంగతి పక్కన పెడితే అందులో ఆ ఊరిలో ఎలాంటి దొంగలు ఉండేవారో, ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో చూపించారు. అప్పుడూ కొన్ని అభ్యంతరాలు వచ్చాయి కానీ మరీ కోర్టు మెట్లు ఎక్కే దాకా కాదు. అదే టైంలో భానుచందర్ స్టువర్ట్ పురం దొంగలు సైతం ఇదే బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. చిరుతో పోలిస్తే ఇది మంచి ఫలితం అందుకుంది. దీన్నీ ఎవరూ తప్పుబట్టలేదు.

కానీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుకు అబ్జెక్షన్ వచ్చి పడింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని నిర్మాతకు నోటీసు వెళ్ళింది. యూట్యూబ్ ట్రైలర్ అయినా సరే సెన్సార్ ఎందుకు చేయించలేదని ప్రశ్నించింది. సరే లాయర్ ద్వారా ఎలాంటి సమాధానం చెబుతారో ఇంకొద్ది రోజుల్లో తేలుతుంది కానీ సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక ఇష్యూ ఎలాంటిదైనా సరే సున్నితత్వం పెరిగిపోయి మనోభావాలు బాగా దెబ్బ తింటున్నాయి. స్టువర్ట్ పురంలో ఇప్పుడెలాంటి విపత్కర పరిస్థితులు లేవు కానీ ఒకప్పుడు ఉన్నవే కదా చూపిస్తున్నారని అభిమానులు అంటున్నారు. చూడాలి కథ ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో.

This post was last modified on August 31, 2023 11:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్య మూవీ అంటే కొరటాలకు సవాలే

దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…

15 minutes ago

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

5 hours ago

సిద్దు తీసుకుంది సరైన నిర్ణయమే

ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…

7 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

9 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

9 hours ago