గోపీచంద్ తో శ్రీనువైట్ల అంతా సెట్ ! 

కొన్నేళ్ళ క్రితం శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ తో కమర్షియల్ మూవీస్ తీసి వరుస హిట్లు కొట్టాడు. ఇప్పటికీ శ్రీను వైట్ల కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వీడియోస్ , మీమ్స్ లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం శ్రీను వైట్ల కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన ప్రీవీయస్ మూవీస్ పెద్దగా ఆడలేదు. వరుస ఫ్లాప్స్ , పైగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా డిజాస్టర్ శ్రీను వైట్లను కుదేలు చేసేసింది. ఈ నేపథ్యంలో విష్ణు మంచుతో ‘డీ’ కి సీక్వెల్ ప్లాన్ చేసుకున్న శ్రీను వైట్ల కి ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం మరింత నిరాశ పరిచింది. 

తాజాగా గోపీచంద్ కి ఒక కథ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు వైట్ల. ఈ సినిమా లొకేషన్ స్కవుటింగ్ కోసం శ్రీను వైట్ల టీంతో వెళ్లారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటలీలో జరగనుంది. దీని కోసం శ్రీను వైట్ల ది బెస్ట్ లొకేషన్స్ చూసుకొని వచ్చాడు. ఈ నెల 9న ఈ కాంబో సినిమా హైదరాబాద్ లో లాంచ్ కానుంది. ఇరవై తర్వాత ఇటలీలో రెగ్యులర్ ఘాట్ మొదలవుతుంది. 

అక్కడ మేజర్ సీన్స్ , యాక్షన్ తీసుకొని వచ్చాక హైదరాబాద్లో నెక్స్ట్ షెడ్యూల్ ఉండబోతుంది. ప్రస్తుతం గోపీచంద్ కూడా హిట్ ట్రాక్ లో లేడు. తాజాగా ‘రామబాణం’ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచి డిజాస్టర్ అనిపించుకుంది. మరి ఇటు శ్రీను వైట్ల కి అటు గోపీచంద్ కి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి. మరి వైట్ల మునుపటిలా మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేసి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.