Movie News

నితిన్ సినిమాతో లయ రీఎంట్రీ?

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ఎప్పట్నుంచో సరైన ప్రాధాన్యం ఉండట్లేదు. గత మూడు దశాబ్దాల్లో పరిస్థితి చూస్తే.. అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లు కూడా చాలామంది ఒక స్థాయికి మించి ఎదగలేకపోయారు. ఐతే ఉన్నంతలో మిగతా వాళ్లతో పోలిస్తే లయ మెరుగనే చెప్పాలి. ఆమె నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ స్టార్‌తో సినిమా చేసింది. మిడ్ రేంజ్ హీరోలు చాలామందితో జట్టు కట్టింది.

ఒక ఐదారేళ్లు ఆమె హవా బాగానే నడిచింది. ఐతే ఇంకా కెరీర్ ఉండగానే ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకుని యుఎస్‌లో సెటిలైపోయింది ఈ విజయవాడ అమ్మాయి. తర్వాత సినిమాల వైపే చూడలేదు. ఆ మధ్య ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ షూటింగ్ అంతా యుఎస్‌లోనే జరగడం, అందులో తన కూతురు ఒక ముఖ్య పాత్ర పోషించడంతో లయ చిన్న క్యామియో రోల్ లాంటిది చేసింది కానీ.. మరే చిత్రంలోనూ నటించలేదు.

పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల మధ్య సినిమాల కోసం ఇండియాకు వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి లేకపోవడం వల్లే పెళ్లి తర్వాత నటించలేదని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన లయ.. ఇప్పుడో పేరున్న సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. నితిన్ కొత్త సినిమా ‘తమ్ముడు’తో ఆమె టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందట.

ఇందులో హీరో సోదరి పాత్రలో ఆమె కనిపించనుందని.. కథలో తన క్యారెక్టర్ కీలకమని.. అందుకే సినిమాకు ‘తమ్ముడు’ అనే టైటిల్ కూడా పెట్టారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా కూడా ఒక వెరైటీ ఆప్షన్ ఎంచుకున్నారట. సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ చిత్రం ‘కాంతార’లో కథానాయికగా నటించి మెప్పించిన సప్తమి గౌడ ‘తమ్ముడు’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టనుందట. కథానాయికది మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే అని.. అందుకే మంచి నటిగా పేరు తెచ్చుకున్న సప్తమిని ఎంచుకున్నారని సమాచారం.

This post was last modified on August 30, 2023 3:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago