ఇండియన్ వెబ్ సిరీస్ లలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఏదంటే ముందు గుర్తొచ్చే పేరు ది ఫ్యామిలీ మ్యాన్. తెలుగు వాళ్ళైన రాజ్ అండ్ డికెల దర్శకత్వ సత్తా ప్రపంచానికి తెలిసింది కూడా దీని వల్లే. ఇది ఎంత పెద్ద సక్సెస్ అంటే మొదటి సీజన్ రెస్పాన్స్ చూసి సెకండ్ పార్ట్ కి అమాంతం బడ్జెట్ పెంచేసి సమంతా లాంటి స్టార్ క్యాస్టింగ్ ని నెగటివ్ రోల్ కి ఒప్పించే స్థాయికి వెళ్ళింది. సినిమా కెరీర్ నెమ్మదిస్తున్న టైంలో మనోజ్ బాజ్ పాయ్ కి ఒక్కసారిగా ఈ ఫ్యామిలి మ్యాన్ పెద్ద బూస్ట్ గా పనిచేసి ఆయన్ని బాలీవుడ్ బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా మార్చింది. డేట్లు కావాలన్నా దొరికే పరిస్థితి లేదు.
సరే దీనికి మెగాస్టార్ కి సంబంధం ఏమనుకుంటున్నారా. నిజానికి ఫ్యామిలీ మ్యాన్ ని సినిమాగా తీయాలనే రాజ్ అండ్ డికె స్క్రిప్ట్ సిద్ధం చేశారు. నిర్మాత అశ్వినీదత్ గారికి సబ్జెక్టు విపరీతంగా నచ్చేసి చిరంజీవికి వినిపించారు. అప్పుడే ఖైదీ నెంబర్ 150 విజయాన్ని ఆస్వాదిస్తున్న చిరుకి స్టోరీ నచ్చింది కానీ తాను పిల్లల తండ్రిగా, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న లేడీకి భర్తగా అంటే ప్రేక్షకులు అంగీకరించరేమోనన్న అనుమానం కలిగింది. పోనీ ఇద్దరు పిల్లలు లేకుండా కొంచెం మార్చమని అడిగారు. ఇన్ని సంశయాల మధ్య అది ముందుకు వెళ్ళలేదు.
కట్ చేస్తే అదే ఫ్యామిలీ మ్యాన్ ని వెబ్ సిరీస్ గా మార్చి మనోజ్ ని తీసుకురావడం కొత్త మలుపుకి దారి తీసింది. ఒకవేళ చిరంజీవి ఫ్యామిలీ మ్యాన్ ని సినిమాగా చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ సరైన నిర్ణయమే తీసుకున్నారనిపిస్తోంది. లేదూ కొన్ని కీలక మార్పులతో ప్రాజెక్టు ఓకే అయ్యుంటే ఒక సెన్సేషన్ గా నిలిచే అవకాశాలనూ కొట్టి పారేయలేం. ఇదంతా స్వయంగా అశ్వినిదత్ గారే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఈ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చిరంజీవికి ఫ్యామిలీ మ్యాన్ లాంటి పాత్రలు నిజంగానే బాగుంటాయి. ట్రై చేస్తే అద్భుతాలే జరగొచ్చు.
This post was last modified on August 30, 2023 11:13 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…