స్టార్ హీరో సినిమా అంటే అప్ డేట్స్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. కానీ ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ కోసం ఏ అభిమానులు ఎదురుచూడని విధంగా చూస్తున్నారు. దీనికి కారణం ఈ మధ్య మహేష్ , తమన్ మధ్య చెడిందనే వార్త ఒకటి బయటికి రావడమే. పూజ హెగ్డే తో పాటు తమన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి అవుట్ అనే మాట గట్టిగా వినిపించింది. మళ్ళీ త్రివిక్రమ్ మహేష్ ను ఒప్పించుకున్నాడని ఏవో వార్తలు వచ్చాయి.
నిజానికి గుంటూరు కారం మ్యూజిక్ విషయంలో తెరవెనుక ఏదో జరిగిన మాట నిజమే. అందుకే తమన్ కూడా ఈ ఆల్బమ్ ను ఛాలెంజింగ్ గా తీసుకొని మహేష్ తో పాటు అతని అభిమానులని కూడా మెప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ను ఇప్పటికే ముగ్గురు నలుగురు సింగర్స్ తో పాడించాడు. తాజాగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్ లో ఒకరైన శేఖర్ రవ్జియని చేత పాడించారు. మొస్ట్లీ శేఖర్ పాడిన వర్షనే బయటికి రానుందని తెలుస్తుంది. శేఖర్ అల్లు అర్జున్ కోసం నా పేరు సూర్య లో ఓ సాంగ్ పాడాడు. ఇప్పుడు మహేష్ కి పాడాడు.
మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం ఏ ముహూర్తాన మొదలిందో కానీ అప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. షూటింగ్ కూడా నత్త నడక నడుస్తుంది. మ్యూజిక్ విషయంలో త్రివిక్రమ్ , తమన్ ఇద్దరు కిందా మీదా అవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ డిసెంబర్ కల్లా ఘాట్ పూర్తి చేసి సంక్రాంతి రేస్ లోనే నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
This post was last modified on August 29, 2023 7:59 pm
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…