Movie News

మహేష్ కోసం థమన్ తాపత్రయం

స్టార్ హీరో సినిమా అంటే అప్ డేట్స్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. కానీ ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ కోసం ఏ అభిమానులు ఎదురుచూడని విధంగా చూస్తున్నారు. దీనికి కారణం ఈ మధ్య మహేష్ , తమన్ మధ్య చెడిందనే వార్త ఒకటి బయటికి రావడమే. పూజ హెగ్డే తో పాటు తమన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి అవుట్ అనే మాట గట్టిగా వినిపించింది. మళ్ళీ త్రివిక్రమ్ మహేష్ ను ఒప్పించుకున్నాడని ఏవో వార్తలు వచ్చాయి. 

నిజానికి గుంటూరు కారం మ్యూజిక్ విషయంలో తెరవెనుక ఏదో జరిగిన మాట నిజమే. అందుకే తమన్ కూడా ఈ ఆల్బమ్ ను ఛాలెంజింగ్ గా తీసుకొని మహేష్ తో పాటు అతని అభిమానులని కూడా మెప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ను ఇప్పటికే ముగ్గురు నలుగురు సింగర్స్ తో పాడించాడు. తాజాగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్ లో ఒకరైన శేఖర్ రవ్జియని చేత పాడించారు. మొస్ట్లీ శేఖర్ పాడిన వర్షనే బయటికి రానుందని తెలుస్తుంది. శేఖర్ అల్లు అర్జున్ కోసం నా పేరు సూర్య లో ఓ సాంగ్ పాడాడు. ఇప్పుడు మహేష్ కి పాడాడు. 

మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం ఏ ముహూర్తాన మొదలిందో కానీ అప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. షూటింగ్ కూడా నత్త నడక నడుస్తుంది. మ్యూజిక్ విషయంలో త్రివిక్రమ్ , తమన్ ఇద్దరు కిందా మీదా అవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ డిసెంబర్ కల్లా ఘాట్ పూర్తి చేసి సంక్రాంతి రేస్ లోనే నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Satya

Recent Posts

పవన్ సభకు తెలంగాణ పోలీసుల ‘నో’

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…

54 minutes ago

రాజమౌళి లక్ష్యం… సినీ ప్రియుల స్వప్మం

తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…

3 hours ago

సేతుపతి స్థానంలో రాజశేఖర్?

దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…

3 hours ago

అరడజను సినిమాలు ‘పెద్ది’కి పోటీగా

అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…

3 hours ago

తెలంగాణలో పెద్ది టెన్షన్… కానీ ఏపీలో మొదలెట్టేశారు

తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…

4 hours ago

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చు రాజుకుందా…?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…

4 hours ago