Movie News

OG హైప్ హద్దులు దాటేస్తోంది

విపరీతమైన అంచనాలు మోసుకొచ్చే స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. అందులోనూ పవర్ స్టార్ మూవీ అంటే చెప్పేదేముంది. మూడు రీమేకులు వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో తర్వాత చేస్తున్న స్ట్రెయిట్ మూవీగా ఓజి మీద హైప్ అంతకంతా వైరల్ ఫీవర్ లా అభిమానులే పెంచేస్తున్నారు. పరస్పరం ట్వీట్లు మెసేజులు పెట్టుకుంటూ, వీడియో చూశాక చనిపోయినా పర్వాలేదనే రేంజ్ లో దర్శకుడు సుజిత్ మాస్ సంభవం చూపిస్తాడని తెగ ఊరించుకుంటూ బజ్ ని అమాంతం పెంచేస్తున్నారు.

నిజానికి ఓజి టీజర్ రూపంలో వస్తున్న వీడియో కేవలం డెబ్భై సెకండ్లే. రెండు పవర్ ఫుల్ షాట్లు పెట్టేసి, టైటిల్ కార్డు, ఇంట్రో, ఎండ్ క్రెడిట్స్ అన్ని కలుపుకుని ఆ లెన్త్ ఉంటుందట. పవన్ స్వయంగా చెప్పే డైలాగు కూడా ఏమి ఉండదట. కేవలం అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ లో ఎలివేషన్లు ఇచ్చేలా సుజిత్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. అలాంటప్పుడు మరీ ఎక్కువ ఊహించుకున్నా ప్రమాదమే. ఎందుకంటే ఏ కొంచెం నిరాశ పరిచినా ఇదే ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తారు. మేము అనుకున్న స్థాయిలో లేదని నెగటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఇది లేనిపోని ఇబ్బందులను తెచ్చి పెడుతుంది.

ఇంకా షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉన్న ఓజి నుంచి ఎక్కువ ఫుటేజ్ అందుబాటులో లేదు కాబట్టే ఉన్నంతలో బెస్ట్ ఇవ్వడానికి సుజిత్ ట్రై చేస్తున్నాడు. తమన్ కూడా ఈసారి ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఒకానొక కాలంలో ముంబైని వణికించిన డాన్ కథ ఆధారంగా తీస్తున్నారని వినికిడి. ఇమ్రాన్ హష్మీ, శ్రేయ రెడ్డి, కిక్ శ్యామ్ లాంటి పెద్ద క్యాస్టింగ్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఓజి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ ఉండొచ్చు. 

This post was last modified on August 28, 2023 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago