బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పఠాన్ తర్వాత కొత్త ఊపిరినిచ్చిన బ్లాక్ బస్టర్ గా గదర్ 2 సృష్టించిన సంచలనం అయిదు వందల కోట్ల మార్కుకి తీసుకెళ్ళిపోయింది. చాలా బిసి సెంటర్స్ లో ఇంకా స్ట్రాంగ్ గా ఉండటం చూస్తే జనానికి ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతటి విజయాన్ని ఆస్వాదిస్తుండగానే ఈ సినిమా సంగీతానికి సంబంధించిన గొడవ కొత్త వివాదం రేపుతోంది. ఇరవై రెండేళ్ల ఏళ్ళ క్రితం వచ్చిన ఫస్ట్ గదర్ కు ఉత్తమ్ సింగ్ సంగీతం సమకూర్చారు. ఆయన స్వరపరిచిన పాటలు అప్పట్లో ఊపేశాయి. ఆడియో అమ్మకాలు భారీ ఎత్తున జరిగి ఎక్కడ చూసినా ఇదే మ్యూజిక్ వినిపించేది.
ముఖ్యంగా ఉడుజా కాలే కావా, మై నికలా గడి లేకే ఓ రేంజ్ ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే ట్రెండ్ ఫాలో అవుతూ దర్శకుడు అనిల్ శర్మ పెద్దాయనకు ఛాన్స్ ఇవ్వకుండా మిథున్ ని తీసుకొచ్చారు. అతను తనకిచ్చిన సూచనల ప్రకారమే వాటిని కొద్దిగా రీమిక్స్ చేశాడు. అవి బాగా రీచ్ అయ్యాయి. దీనిపై ఉత్తమ్ సింగ్ భగ్గుమన్నారు. తన అనుమతి లేకుండా, కనీసం చెప్పకుండా తన ట్యూన్స్ వాడుకున్నారని, ఇది క్షమించరాని నేరమని మీడియాకు చెప్పడంతో దుమారం మొదలైంది. లేదూ నేను ముందే సమాచారం ఇచ్చానని అనిల్ శర్మ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగింది.
మిథున్ ఇంకో వెర్షన్ చెబుతున్నాడు. ఉత్తమ్ సింగ్ కి ముందే తెలుసని యూనిట్ చెప్పడం వల్ల తాను ప్రొసీడ్ అయ్యాయని, అయినా డబ్బులు పోసికొన్న మ్యూజిక్ కంపనీలకు ఆ హక్కులు ఉంటాయి తప్ప సంగీత దర్శకులకు కాదని అంటున్నాడు. అసలు తాను ఆ రెండు పాటలు వద్దు ఫ్రెష్ గా కంపోజ్ చేద్దామని చెప్పినా ఎమోషన్ కోసం కావాలని అడగటంతో చేశానని అన్నాడు. గతంలో ఇదే తరహా వివాదాలు ఇళయరాజా, బాలు, ఆడియో సంస్థల మధ్య వచ్చిన సంగతి తెలిసిందే. కాపీ రైట్ యాక్ట్ ఉన్నప్పటికీ తరచుగా ఇలాంటివి జరగడం అనూహ్యం. ఈ గదర్ 2 గొడవకు చర్చల ద్వారా చెక్ పెట్టుకుంటే మంచిది.
This post was last modified on August 28, 2023 10:53 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…