బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ది కాశ్మీర్ ఫైల్స్ కి జాతీయ ఉత్తమ సమైక్యత చిత్రంగా అవార్డు ఇవ్వడం గురించి మెల్లగా వివాదం రాజుకుంటోంది. ఒక అజెండాతో తీసిన ఇలాంటి సినిమాకు అర్హత లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెలిబుచ్చారు. 90 దశకంలో జరిగిన కాశ్మీర్ పండిట్ల ఊచకోత గురించి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆవిష్కరించిన ఈ ఎమోషనల్ డ్రామాలో తప్పొప్పులను ఒక కోణంలోనే చూపించారని, దాని వల్ల ఒక వర్గం మీద తప్పుడు అభిప్రాయాలు ఏర్పడ్డాయని రిలీజ్ టైంలో చాలా విమర్శలు వచ్చాయి.
అసలు సమైక్యత ప్రశ్నే లేని కాశ్మీర్ ఫైల్స్ ని ఎలా గుర్తిస్తారని విమర్శకులు అంటున్నారు. గతంలో ఈ విభాగంలో పురస్కారం అందుకున్న రోజా, బొంబాయి, సప్తపది, రుద్రవీణ, బోర్డర్, షహీద్ ఉద్ధం సింగ్, పుకార్, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, జక్మ్ తదితర సినిమాలు చూస్తే జాతీయ స్థాయిలో సమైక్య వాదం అంటే ఏమిటో తెలుస్తుందని ఉదాహరణలు చెబుతున్నారు. ఇందులో నిజముంది. ఎందుకంటే ఈ క్యాటగిరీలో ఎంపికైన వాటిలో మంచి మానవతా విలువలు, సమైక్య జీవన సిద్ధాంతం పాటు మనుషులంతా ఒకటేననే సందేశం అంతర్లీనంగా ఉంటుంది.
కానీ కాశ్మీర్ ఫైల్స్ లో అవెక్కడ ఉన్నాయని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచి దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉందని, ఆ కారణంగానే ఇప్పుడీ సత్కారం ఇస్తున్నారని నిలదీస్తున్న వాళ్ళు లేకపోలేదు. రకరకాల కోణాల్లో అవార్డుల పట్ల వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కమిటీ పెద్దలు పట్టించుకుంటారో లేదో కానీ ఈ మాత్రం స్పందన రాబోయే సంవత్సరాల్లో జరగబోయే ఎంపికల మీద కొంతైనా ప్రభావం చూపిస్తే మంచిదే. ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన ది వ్యాక్సిన్ వార్ వచ్చే నెల సెప్టెంబర్ 28న సలార్ తో పాటు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక…
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…