ఆస్కార్ దాకా వెళ్లి నాటు నాటు పాటకు పురస్కారం అందుకున్న ఆర్ఆర్ఆర్ కు జాతీయ అవార్డుల్లో ఆరు విభాగాల్లో విజేతగా నిలవడం మరో సెలబ్రేషన్ కు కారణంగా నిలుస్తోంది. ఉత్తమ నటులుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఒకరికి లేదా ఇద్దరికీ సంయుక్తంగా రావొచ్చనే అంచనాలకు భిన్నంగా పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ దాని కొట్టేయడంతో ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. దర్శకుడి గా రాజమౌళి సైతం విజేతగా నిలవలేకపోవడం ఫ్యాన్స్ ని కొంత బాధించినా ఫైనల్ గా ఎక్కువ క్యాటగిరీలలో గర్వంగా నిలబడిన ఘనత మాత్రం జక్కన్న సృష్టించిన విజువల్ వండర్ కే దక్కింది.
బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్ (అన్ని వర్గాలను అలరించిన వినోదాత్మక చిత్రం)గా ట్రిపులార్ యునానిమస్ గా నిలిచింది. కొమురం భీముడొ పాటకు గాను కాలభైరవ ఉత్తమ గాయకుడిగా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణి (నేపధ్య సంగీతం) తన మిత్రుడు దేవిశ్రీప్రసాద్(పుష్ప పాటలు)తో కలిసి ఈ గౌరవాన్ని పొందబోతున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీకి గాను కింగ్ సాలమన్, నృత్య దర్శకత్వానికి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్ కు గాను వి శ్రీనివాస్ మోహన్ టాలీవుడ్ బెస్ట్ మల్టీస్టారర్ కు పని చేసినందుకు గాను జాతీయ గౌరవం అందుకున్నారు.
ఆర్ఆర్ఆర్ ఇలా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ మరికొన్ని అవార్డులు రావాల్సిందన్న అభిప్రాయం కొట్టిపారేయలేం కానీ నామినేషన్లు అధికంగా ఉన్న దృష్ట్యా కొన్ని పరిమితుల వల్ల ఇలాంటి నిర్ణయాలకు ప్రేరేపించి ఉండొచ్చు. ఆస్కార్ వచ్చిన ఆనందం కొన్ని నెలలు గడవటం ఆలస్యం ఇప్పుడీ గుడ్ న్యూస్ డివివి దానయ్య బృందాన్ని మరోసారి సంతోషంలో ముంచెత్తింది. పన్నెండు వందల కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో జపాన్ లో ఇప్పటికీ అయిదు వందల రోజులకు పైగా ప్రదర్శితమవుతున్న ఆర్ఆర్ఆర్ ఇటు ఓటిటిలో అటు శాటిలైట్ లోనూ సంచలనాత్మక రికార్డులు నమోదు చేయడం తెలిసిందే.
This post was last modified on August 24, 2023 7:56 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…