ఆస్కార్ దాకా వెళ్లి నాటు నాటు పాటకు పురస్కారం అందుకున్న ఆర్ఆర్ఆర్ కు జాతీయ అవార్డుల్లో ఆరు విభాగాల్లో విజేతగా నిలవడం మరో సెలబ్రేషన్ కు కారణంగా నిలుస్తోంది. ఉత్తమ నటులుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఒకరికి లేదా ఇద్దరికీ సంయుక్తంగా రావొచ్చనే అంచనాలకు భిన్నంగా పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ దాని కొట్టేయడంతో ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. దర్శకుడి గా రాజమౌళి సైతం విజేతగా నిలవలేకపోవడం ఫ్యాన్స్ ని కొంత బాధించినా ఫైనల్ గా ఎక్కువ క్యాటగిరీలలో గర్వంగా నిలబడిన ఘనత మాత్రం జక్కన్న సృష్టించిన విజువల్ వండర్ కే దక్కింది.
బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్ (అన్ని వర్గాలను అలరించిన వినోదాత్మక చిత్రం)గా ట్రిపులార్ యునానిమస్ గా నిలిచింది. కొమురం భీముడొ పాటకు గాను కాలభైరవ ఉత్తమ గాయకుడిగా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణి (నేపధ్య సంగీతం) తన మిత్రుడు దేవిశ్రీప్రసాద్(పుష్ప పాటలు)తో కలిసి ఈ గౌరవాన్ని పొందబోతున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీకి గాను కింగ్ సాలమన్, నృత్య దర్శకత్వానికి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్ కు గాను వి శ్రీనివాస్ మోహన్ టాలీవుడ్ బెస్ట్ మల్టీస్టారర్ కు పని చేసినందుకు గాను జాతీయ గౌరవం అందుకున్నారు.
ఆర్ఆర్ఆర్ ఇలా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ మరికొన్ని అవార్డులు రావాల్సిందన్న అభిప్రాయం కొట్టిపారేయలేం కానీ నామినేషన్లు అధికంగా ఉన్న దృష్ట్యా కొన్ని పరిమితుల వల్ల ఇలాంటి నిర్ణయాలకు ప్రేరేపించి ఉండొచ్చు. ఆస్కార్ వచ్చిన ఆనందం కొన్ని నెలలు గడవటం ఆలస్యం ఇప్పుడీ గుడ్ న్యూస్ డివివి దానయ్య బృందాన్ని మరోసారి సంతోషంలో ముంచెత్తింది. పన్నెండు వందల కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో జపాన్ లో ఇప్పటికీ అయిదు వందల రోజులకు పైగా ప్రదర్శితమవుతున్న ఆర్ఆర్ఆర్ ఇటు ఓటిటిలో అటు శాటిలైట్ లోనూ సంచలనాత్మక రికార్డులు నమోదు చేయడం తెలిసిందే.
This post was last modified on August 24, 2023 7:56 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…