టాలీవుడ్లో బ్రహ్మానందం సహా నిన్నటి తరం కమెడియన్లందరూ డౌన్ అవుతున్న టైంలో వెన్నెల కిషోర్ రైజ్ అయ్యాడు. అప్పటికే అతను తనదైన ముద్ర వేసినప్పటికీ.. బ్రహ్మి డౌన్ అయ్యాక మరింత చెలరేగిపోయాడు. బ్రహ్మి లాగే కొన్ని సినిమాలను తన కామెడీతో నిలబెట్టాడు అంటే అతిశయోక్తి కాదు. రాను రాను తెలుగు సినిమాల్లో కామెడీ డోస్ తగ్గిపోతున్నప్పటికీ.. వెన్నెల కిషోర్ ఉన్నాడంటే కనిపించినంత సేపు నవ్వులు గ్యారెంటీ అనే భరోసాను ఇవ్వగలిగాడు.
కానీ కిషోర్ కూడా ఈ మధ్య వేస్ట్ అయిపోతున్నాడనే ఫీలింగ్ కలుగుతోంది. అతణ్ని దర్శకులు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. కిషోర్కు చిన్న ఛాన్స్ ఇచ్చినా ఎలా చెలరేగిపోతాడో ‘సామజవరగమన’ లాంటి సినిమాలు ఉదాహరణ అయితే.. అతణ్ని ఎలా వేస్ట్ చేసుకోవాలో చెప్పడానికి ‘భోళా శంకర్’ లాంటి చిత్రాలు ఎగ్జాంపుల్.
ఐతే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఏకంగా హీరో అయిపోతున్నాడు. అతను లీడ్ రోల్లో ‘చారీ 111’ అనే సినిమాను నిన్న అనౌన్స్ చేశారు. ఒక యానిమేటెడ్ వీడియోతో వెన్నెల కిషోర్ పాత్రకు ఇంట్రో ఇస్తూ సినిమాను అనౌన్స్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కిషోర్ది ప్రత్యేకమైన కామెడీ టైమింగ్. అతడికి వెర్రి వెంగళప్ప పాత్రలు ఇస్తే అదరగొడతాడు. టిపికల్ క్యారెక్టర్లను బాగా పోషిస్తాడు.
‘చారీ 111’లో తాను కన్ఫ్యూజ్ అయి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ఒక తింగరి ఏజెంట్ పాత్రలో అతను కనిపించబోతున్నాడు. ఇంట్రో వరకు అయితే ఈ క్యారెక్టర్, సినిమా ఎగ్జైటింగ్గానే అనిపిస్తున్నాయి. సినిమా ఫుల్లుగా ఇదే ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉంటే.. కిషోర్ను పూర్తిగా వాడుకుంటే ప్రేక్షకులు కడుపులు చెక్కలయ్యేలా నవ్వులు పండటం గ్యారెంటీ. అదితి సోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి అతను కిషోర్ను ఎంత బాగా ఉపయోగించుకుంటాడో చూడాలి.
This post was last modified on August 25, 2023 8:19 am
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…