ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా అనిరుధ్ పేరు చెప్పేయొచ్చు. ‘జైలర్’ సినిమాతో సౌత్ ఇండియా అంతటా అతడి పేరు మార్మోగిపోతోంది. యావరేజ్ మూవీని కూడా తన బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలతో అతను ఎలివేట్ చేసి బ్లాక్బస్టర్ను చేశాడంటూ అతడి మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ‘జైలర్’తో ప్రేక్షకులను అతను మామూలుగా ఊపేయలేదు.
ఇంకొన్ని రోజుల్లోనే ‘జవాన్’తో మరోసారి అనిరుధ్ తన ముద్రను చూపిస్తాడని.. ఆ చిత్రంతో మొత్తం దేశాన్ని షేక్ చేస్తాడని భావిస్తున్నారు. ముఖ్యంగా ‘జైలర్’ సినిమాను అతను పైకి లేపిన తీరు చూసి ఎలాగైనా అనిరుధ్ను తమ సినిమాలోకి తీసుకోవాలని చాలామంది దర్శకులు, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. భారీ పారితోషకాలు ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే చాలా బిజీగా ఉన్న అనిరుధ్ అంత ఈజీగా సినిమా ఒప్పుకోవడం లేదు.
ఇలాంటి టైంలో అనిరుధ్ను.. నాగచైతన్య కొత్త చిత్రం కోసం ఒప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక ఫిషర్ మ్యాన్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు చందు మొండేటి రూపొందించనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బేనర్లో పెద్ద బడ్జెట్లో ఈ సినిమా తీయబోతున్నారు. కీర్తి సురేష్ను కథానాయికగా అనుకుంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓవైపు భారీ సినిమాలే చేస్తూ.. కొత్తగా ఎవరు కమిట్మెంట్ అడిగినా నో చెబుతున్న అనిరుధ్.. ఈ సినిమాకు ఓకే అన్నాడంటే అది పెద్ద విశేషమే.
బహుశా పారితోషకం కంటే కూడా ఈ కథ అతణ్ని ఎగ్జైట్ చేసి ఉండొచ్చు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడంటే చిన్నా పెద్దా తేడా చూడడు. ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి మిడ్ రేంజ్ సినిమాలకు కూడా అతను అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. కాబట్టి చైతూ సినిమాకు కూడా మంచి ఔట్ పుట్ ఆశించవచ్చు. ఇప్పుడు అతనున్న ఫాంలో ఈ సినిమాను ఒప్పుకోవడమే మంచి క్రేజ్ తీసుకొచ్చే విషయం. కాబట్టి అనిరుధ్ను ఒప్పించారంటే సినిమా సగం సక్సెస్ అయిపోయినట్లే.
This post was last modified on August 24, 2023 12:14 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…