‘తానాజీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రభాస్ నేరుగా బాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో ప్రభాస్కి దేశవ్యాప్తంగా గ్యారెంటీ మార్కెట్ వుందని తేలడంతో ‘ఆదిపురుష్’ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో విలన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ ఓం రౌత్ గత చిత్రం ‘తానాజీ’లో విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఇందులోను విలన్గా నటించనున్నాడని సమాచారం. రావణుడి పాత్ర కోసం సైఫ్ తన ఆకారాన్ని మార్చుకోనున్నాడట. హీరోగా సైఫ్ నటిస్తోన్న సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అతను వెబ్ సిరీస్ల వైపు వెళ్లిపోయాడు.
అలాంటి టైమ్లో ‘తానాజీ’తో సైఫ్కి పెద్ద హిట్ ఇచ్చాడు ఓం రౌత్. అతడే ప్రభాస్కి కూడా విలన్గా నటిస్తే బాగుంటుందని ఓం భావిస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వస్తుందని అంటున్నారు. ఇక సీతగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి కథానాయికగా ఎంపిక కానుంది.
This post was last modified on August 20, 2020 12:02 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…