‘తానాజీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రభాస్ నేరుగా బాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో ప్రభాస్కి దేశవ్యాప్తంగా గ్యారెంటీ మార్కెట్ వుందని తేలడంతో ‘ఆదిపురుష్’ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో విలన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ ఓం రౌత్ గత చిత్రం ‘తానాజీ’లో విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఇందులోను విలన్గా నటించనున్నాడని సమాచారం. రావణుడి పాత్ర కోసం సైఫ్ తన ఆకారాన్ని మార్చుకోనున్నాడట. హీరోగా సైఫ్ నటిస్తోన్న సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అతను వెబ్ సిరీస్ల వైపు వెళ్లిపోయాడు.
అలాంటి టైమ్లో ‘తానాజీ’తో సైఫ్కి పెద్ద హిట్ ఇచ్చాడు ఓం రౌత్. అతడే ప్రభాస్కి కూడా విలన్గా నటిస్తే బాగుంటుందని ఓం భావిస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వస్తుందని అంటున్నారు. ఇక సీతగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి కథానాయికగా ఎంపిక కానుంది.
This post was last modified on August 20, 2020 12:02 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…