‘తానాజీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రభాస్ నేరుగా బాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో ప్రభాస్కి దేశవ్యాప్తంగా గ్యారెంటీ మార్కెట్ వుందని తేలడంతో ‘ఆదిపురుష్’ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో విలన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ ఓం రౌత్ గత చిత్రం ‘తానాజీ’లో విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఇందులోను విలన్గా నటించనున్నాడని సమాచారం. రావణుడి పాత్ర కోసం సైఫ్ తన ఆకారాన్ని మార్చుకోనున్నాడట. హీరోగా సైఫ్ నటిస్తోన్న సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అతను వెబ్ సిరీస్ల వైపు వెళ్లిపోయాడు.
అలాంటి టైమ్లో ‘తానాజీ’తో సైఫ్కి పెద్ద హిట్ ఇచ్చాడు ఓం రౌత్. అతడే ప్రభాస్కి కూడా విలన్గా నటిస్తే బాగుంటుందని ఓం భావిస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వస్తుందని అంటున్నారు. ఇక సీతగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి కథానాయికగా ఎంపిక కానుంది.
This post was last modified on August 20, 2020 12:02 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…