‘తానాజీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రభాస్ నేరుగా బాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో ప్రభాస్కి దేశవ్యాప్తంగా గ్యారెంటీ మార్కెట్ వుందని తేలడంతో ‘ఆదిపురుష్’ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో విలన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ ఓం రౌత్ గత చిత్రం ‘తానాజీ’లో విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఇందులోను విలన్గా నటించనున్నాడని సమాచారం. రావణుడి పాత్ర కోసం సైఫ్ తన ఆకారాన్ని మార్చుకోనున్నాడట. హీరోగా సైఫ్ నటిస్తోన్న సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అతను వెబ్ సిరీస్ల వైపు వెళ్లిపోయాడు.
అలాంటి టైమ్లో ‘తానాజీ’తో సైఫ్కి పెద్ద హిట్ ఇచ్చాడు ఓం రౌత్. అతడే ప్రభాస్కి కూడా విలన్గా నటిస్తే బాగుంటుందని ఓం భావిస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వస్తుందని అంటున్నారు. ఇక సీతగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి కథానాయికగా ఎంపిక కానుంది.
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…
తెలుగులో వచ్చిన ఉత్తమ హార్రర్ చిత్రాల్లో.. ‘మసూద’ కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు. ఇందులో పెద్దగా పేరున్న నటులేమీ నటించలేదు. అప్…
తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనాల్లో ‘బేబీ’ ఒకటి. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్…
సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం జగన్ నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు…