Movie News

తమిళ జర్నలిస్టుకి పేలిపోయే పంచు

ఖుషి ప్రమోషన్ల కోసం రాష్ట్రాలు తిరుగుతున్న విజయ్ దేవకొండకు అక్కడి మీడియా నుంచి ఇరికించే ప్రశ్నలు ఎదురవుతున్నా చాలా తెలివిగా పరిణితితో సమాధానం ఇస్తున్న తీరు బాగా వైరలవుతోంది. ప్రెస్ మీట్ లో భాగంగా ఒక కోలీవుడ్ జర్నలిస్ట్ నీకు తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్ తప్ప మిగిలినవాళ్ల  గురించి అంతగా తెలియదు కదానే రీతిలో చురక లాంటి క్వశ్చన్ వేశాడు. నిజానికి ఇతర భాషలకు సంబంధించిన డైరెక్టర్ల గురించి తెలుసుకునేంత అవగాహన, ఓపిక స్టార్లకు ఉండదు. కానీ రౌడీ హీరో తాను అలాంటి టైపు కాదని కెమెరా సాక్షిగా కుండబద్దలు కొట్టాడు.

సదరు విలేఖరికి సమాధానమిస్తూ నేను అరుణ్ ప్రభుని చాలా ఇష్టపడతానని, అతనెవరో నీకైనా తెలుసా అంటూ రివర్స్ లో ప్రశ్న అడిగే సరికి అవతలి వ్యక్తి నీళ్లు నమిలాడు. దానికి విజయ్ దేవరకొండ కొనసాగిస్తూ అరువి లాంటి అద్భుత చిత్రం తీసింది అతనేనని, తర్వాత వాజి అనే మరో మూవీ కూడా ఇచ్చాడని చెప్పడంతో చప్పట్లు వినిపించాయి. అంతే కాదు శ్రీకార్తిక్ ప్రస్తావనతో పాటు ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ తీస్తున్న అరుణ్ మాతేశ్వరన్ ని గుర్తు చేయడంతో ఆపై అక్కడ సౌండ్ బంద్. దీన్ని బట్టి విజయ్ ఎప్పటికప్పుడు పక్క లాంగ్వేజెస్ సినిమాల మీద ఓ కన్నేశాడని అర్థమైపోయింది.

అతను ఏ ఉద్దేశంతో అడిగినా విజయ్ బదులు చెప్పిన తీరు ఫ్యాన్స్ మధ్య బాగా తిరుగుతోంది. ఖుషి ప్యాన్ ఇండియా మూవీ కానప్పటికీ అందరికీ కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో మల్టీ వెర్షన్లు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో డియర్ కామ్రేడ్, లైగర్ లాంటి వాటితో తమిళంలో చేదు అనుభవాలు ఎదురుకున్న విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడంతో గీత గోవిందంని మించిన సక్సెస్ ఖాయమని నమ్ముతున్నాడు. రెండు గంటల నలభైఐదు నిమిషాల నిడివితో యు/ఏ తెచ్చుకున్న ఖుషికి చికిత్స కోసం యుఎస్ వెళ్లిన సమంతా అక్కడా ప్రమోట్ చేయడం విశేషం.

This post was last modified on August 23, 2023 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

41 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago