ఖుషి ప్రమోషన్ల కోసం రాష్ట్రాలు తిరుగుతున్న విజయ్ దేవకొండకు అక్కడి మీడియా నుంచి ఇరికించే ప్రశ్నలు ఎదురవుతున్నా చాలా తెలివిగా పరిణితితో సమాధానం ఇస్తున్న తీరు బాగా వైరలవుతోంది. ప్రెస్ మీట్ లో భాగంగా ఒక కోలీవుడ్ జర్నలిస్ట్ నీకు తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్ తప్ప మిగిలినవాళ్ల గురించి అంతగా తెలియదు కదానే రీతిలో చురక లాంటి క్వశ్చన్ వేశాడు. నిజానికి ఇతర భాషలకు సంబంధించిన డైరెక్టర్ల గురించి తెలుసుకునేంత అవగాహన, ఓపిక స్టార్లకు ఉండదు. కానీ రౌడీ హీరో తాను అలాంటి టైపు కాదని కెమెరా సాక్షిగా కుండబద్దలు కొట్టాడు.
సదరు విలేఖరికి సమాధానమిస్తూ నేను అరుణ్ ప్రభుని చాలా ఇష్టపడతానని, అతనెవరో నీకైనా తెలుసా అంటూ రివర్స్ లో ప్రశ్న అడిగే సరికి అవతలి వ్యక్తి నీళ్లు నమిలాడు. దానికి విజయ్ దేవరకొండ కొనసాగిస్తూ అరువి లాంటి అద్భుత చిత్రం తీసింది అతనేనని, తర్వాత వాజి అనే మరో మూవీ కూడా ఇచ్చాడని చెప్పడంతో చప్పట్లు వినిపించాయి. అంతే కాదు శ్రీకార్తిక్ ప్రస్తావనతో పాటు ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ తీస్తున్న అరుణ్ మాతేశ్వరన్ ని గుర్తు చేయడంతో ఆపై అక్కడ సౌండ్ బంద్. దీన్ని బట్టి విజయ్ ఎప్పటికప్పుడు పక్క లాంగ్వేజెస్ సినిమాల మీద ఓ కన్నేశాడని అర్థమైపోయింది.
అతను ఏ ఉద్దేశంతో అడిగినా విజయ్ బదులు చెప్పిన తీరు ఫ్యాన్స్ మధ్య బాగా తిరుగుతోంది. ఖుషి ప్యాన్ ఇండియా మూవీ కానప్పటికీ అందరికీ కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో మల్టీ వెర్షన్లు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో డియర్ కామ్రేడ్, లైగర్ లాంటి వాటితో తమిళంలో చేదు అనుభవాలు ఎదురుకున్న విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడంతో గీత గోవిందంని మించిన సక్సెస్ ఖాయమని నమ్ముతున్నాడు. రెండు గంటల నలభైఐదు నిమిషాల నిడివితో యు/ఏ తెచ్చుకున్న ఖుషికి చికిత్స కోసం యుఎస్ వెళ్లిన సమంతా అక్కడా ప్రమోట్ చేయడం విశేషం.
This post was last modified on August 23, 2023 4:59 pm
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…
కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…