ఖుషి ప్రమోషన్ల కోసం రాష్ట్రాలు తిరుగుతున్న విజయ్ దేవకొండకు అక్కడి మీడియా నుంచి ఇరికించే ప్రశ్నలు ఎదురవుతున్నా చాలా తెలివిగా పరిణితితో సమాధానం ఇస్తున్న తీరు బాగా వైరలవుతోంది. ప్రెస్ మీట్ లో భాగంగా ఒక కోలీవుడ్ జర్నలిస్ట్ నీకు తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్ తప్ప మిగిలినవాళ్ల గురించి అంతగా తెలియదు కదానే రీతిలో చురక లాంటి క్వశ్చన్ వేశాడు. నిజానికి ఇతర భాషలకు సంబంధించిన డైరెక్టర్ల గురించి తెలుసుకునేంత అవగాహన, ఓపిక స్టార్లకు ఉండదు. కానీ రౌడీ హీరో తాను అలాంటి టైపు కాదని కెమెరా సాక్షిగా కుండబద్దలు కొట్టాడు.
సదరు విలేఖరికి సమాధానమిస్తూ నేను అరుణ్ ప్రభుని చాలా ఇష్టపడతానని, అతనెవరో నీకైనా తెలుసా అంటూ రివర్స్ లో ప్రశ్న అడిగే సరికి అవతలి వ్యక్తి నీళ్లు నమిలాడు. దానికి విజయ్ దేవరకొండ కొనసాగిస్తూ అరువి లాంటి అద్భుత చిత్రం తీసింది అతనేనని, తర్వాత వాజి అనే మరో మూవీ కూడా ఇచ్చాడని చెప్పడంతో చప్పట్లు వినిపించాయి. అంతే కాదు శ్రీకార్తిక్ ప్రస్తావనతో పాటు ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ తీస్తున్న అరుణ్ మాతేశ్వరన్ ని గుర్తు చేయడంతో ఆపై అక్కడ సౌండ్ బంద్. దీన్ని బట్టి విజయ్ ఎప్పటికప్పుడు పక్క లాంగ్వేజెస్ సినిమాల మీద ఓ కన్నేశాడని అర్థమైపోయింది.
అతను ఏ ఉద్దేశంతో అడిగినా విజయ్ బదులు చెప్పిన తీరు ఫ్యాన్స్ మధ్య బాగా తిరుగుతోంది. ఖుషి ప్యాన్ ఇండియా మూవీ కానప్పటికీ అందరికీ కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో మల్టీ వెర్షన్లు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో డియర్ కామ్రేడ్, లైగర్ లాంటి వాటితో తమిళంలో చేదు అనుభవాలు ఎదురుకున్న విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడంతో గీత గోవిందంని మించిన సక్సెస్ ఖాయమని నమ్ముతున్నాడు. రెండు గంటల నలభైఐదు నిమిషాల నిడివితో యు/ఏ తెచ్చుకున్న ఖుషికి చికిత్స కోసం యుఎస్ వెళ్లిన సమంతా అక్కడా ప్రమోట్ చేయడం విశేషం.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…