తెలుగులో మంచి అభిరుచి ఉన్న సీనియర్ నిర్మాతల్లో శివలెంక కృష్ణప్రసాద్ ఒకరు. ఇప్పుడు చూసినా అడ్వాన్స్డ్గా అనిపించే ‘ఆదిత్య 369’ లాంటి చిత్రాన్ని 90వ దశకంలో భారీ బడ్జెట్ పెట్టి తీసి సాహసోపేత నిర్మాత ఆయన. మధ్యలో కొన్నేళ్లు ప్రొడక్షన్ ఆపేసిన ఆయన.. తర్వాత జెంటిల్మ్యాన్, సమ్మోహనం, యశోద లాంటి చిత్రాలతో మళ్లీ తన అభిరుచిని చాటారు. చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘యశోద’ మంచి ఫలితాన్నే అందించింది.
తర్వాత తన ప్రొడక్షన్లో కొత్త సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటూనే.. ఓ అనువాద చిత్రాన్ని తెలుగులో అందించడానికి సిద్ధమయ్యారు శివలెంక కృష్ణప్రసాద్. శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తమిళంలో ‘800’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎం.ఎస్.శ్రీపతి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ ‘800’ను నిర్మించింది.
ఈ సినిమాను తమిళంలో నిర్మాణ సంస్థే రిలీజ్ చేస్తుండగా… తమిళనాడు మినహా ఆల్ ఇండియా రైట్స్ను శివలెంక కృష్ణప్రసాద్ తీసుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని ఆయన రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని అనేక దేశాల్లో భారీ ఖర్చుతో చిత్రీకరించారు. మురళీధర్ లంకేయుడే అయినా అతడికి తమిళ మూలాలున్నాయి. అతడి భార్యది కూడా చెన్నైయే. నిజానికి ‘800’ సినిమాను అనౌన్స్ చేసినపుడు మంచి క్రేజ్ కనిపించింది.
అందుక్కారణం.. మురళీ పాత్రను విజయ్ సేతుపతితో చేయించాలనుకోవడమే. కానీ ఫస్ట్ లుక్ రిలీజయ్యాక మురళీధరన్ పాత్రను సేతుపతి చేయడం పట్ల తమిళుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మురళీధరన్ తమిళుల కోసం ఎప్పుడూ మాట్లాడలేదని.. అలాంటి తమిళ ద్రోహి పాత్రలో నటించడం ఏంటని సేతుపతిని ప్రశ్నించారు. దీంతో అతను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.
ఆ పాత్రను ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ పోషించాడు. ఐతే మురళీధరన్ జీవితంలో ఎన్ని మలుపులున్నప్పటికీ.. అతనో విదేశీ క్రికెటర్. అతడి పాత్ర పోషించిన నటుడికి ఎలాంటి ఇమేజ్ లేదు. ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులైనా.. మిగతా ఆడియన్స్ అయినా ఏమాత్రం ఆదరిస్తారో చూడాలి. ఇలాంటి సినిమాను కొనుక్కుని కృష్ణప్రసాద్ తన అభిరుచిని చాటినా.. ఆయనకు ఆర్థికంగా ఈ సినిమా ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి.
This post was last modified on August 23, 2023 4:53 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…