మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు మంగళవారం. మామూలుగా పెద్ద హీరోల పుట్టిన రోజులంటే అప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాల నుంచి ఏవైనా కొత్త విశేషాలు పంచుకుంటారేమో అని ఎదురు చూస్తారు అభిమానులు. ఐతే చిరు కొత్త సినిమాలేవీ షూటింగ్ దశలో లేవు. దీంతో కొత్త సినిమాల అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఐతే ఈ విషయంలో సస్పెన్స్ నడుస్తోంది. ‘భోళా శంకర్’ హిట్టయి ఉంటే.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అనుకున్న.కొత్త సినిమా ప్రకటన కచ్చితంగా ఉండేదే.
ముహూర్త వేడుక కూడా చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ ‘భోళా శంకర్’ దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో దాని లాగే రీమేక్ అయిన కొత్త సినిమా విషయంలో సందిగ్ధత నెలకొంది. స్క్రిప్టు మీద మళ్లీ పని చేస్తున్నారని.. అలాగే కళ్యాణ్ కృష్ణను తప్పించి మురుగదాస్ను దర్శకుడిగా తీసుకొస్తున్నారని రకరకాల ప్రచారాలు జరిగాయి.
కానీ మురుగదాస్ ఈ ప్రాజెక్టులోకి రావడం అన్నది అబద్ధం అని తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణే తన టీంతో కలిసి మళ్లీ స్క్రిప్టు మీద పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరు స్క్రిప్టుకు ఓకే చెప్పాకే సినిమా అనౌన్స్మెంట్ ఉండొచ్చంటున్నారు. కాబట్టి చిరు పుట్టిన రోజుకు ఈ సినిమా అనౌన్స్మెంట్ సందేహమే అంటున్నారు.
కాగా ఈ చిత్రం తర్వాత ఉంటుందనుకున్న వశిష్ఠ మూవీ గురించి ఇప్పుడో ఆసక్తికర కబురు వినిపిస్తోంది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు అన్నీ ఓకే అయిపోయాయని.. ప్రి ప్రొడక్షన్ పనులు కొన్ని నెలల పాటు జరగనుండటంతో సినిమా పట్టాలెక్కడానికి సమయం పడుతుందని.. ఐతే చిరు పుట్టిన రోజుకు ఒక మోషన్ పోస్టర్ లాంటిది రిలీజ్ చేసి సినిమాను అనౌన్స్ చేయబోతున్నారని అంటున్నారు. చూద్దాం మరి మెగా బర్త్డేకి ఏం విశేషం ఉంటుందో?
This post was last modified on August 21, 2023 11:58 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…