ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి మెల్లగా దారి సుగమం అవుతోంది. నిన్న జరిగిన సుహాసిని కొడుకు వివాహానికి హాజరైన చిన్న బాలయ్యని చూసి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. ఇంతకు ముందు బొద్దుగా ఉన్న రూపాన్ని సన్నబడేలా చేసుకోవడమే కాక లుక్స్ పరంగానూ అతనిలో చాలా మార్పు వచ్చింది. తండ్రితో కలిసి వచ్చి కలివిడిగా తిరగడమే కాదు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ముచ్చటించడం, కలిసి ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అరుదైన కలయికగా ఫ్యాన్స్ ట్వీట్ల రూపంలో పంచుకుంటున్నారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం మోక్షజ్ఞ శిక్షణకు ఇంకో ఆరేడు నెలలు పడుతుందని తెలిసింది. అది పూర్తి కాగానే ఎవరితో ఎలా లాంచ్ చేయించాలనే విషయంలో బాలయ్య ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికైతే పలు ప్రతిపాదనలున్నాయి. పూరి జగన్నాధ్, బోయపాటి శీను, అనిల్ రావిపూడి ఇలా రెండు మూడు ఆప్షన్లు పెట్టుకున్నారు కానీ వాళ్ళ అందుబాటు, స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి కుదరని పక్షంలో బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 999ని ఎలాగూ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అదే ఉండొచ్చు.
వీలైనంత త్వరగా లాంచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య క్రమంగా వయసుకు తగ్గట్టు భగవంత్ కేసరి లాంటి పాత్రల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు కాబట్టి కమర్షియల్ హంగులున్న గ్లామర్ ప్లస్ యాక్షన్ హీరోగా మోక్షజ్ఞను చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. డెబ్యూ పరంగా అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో బాలయ్యకు తెలియనిది కాదు. తన ఎంట్రీ టైంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత శ్రద్ధ తీసుకుని కెరీర్ ని మలచారో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా కొడుకు భవిష్యత్తుని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఒక ఫంక్షన్ ఫోటో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
This post was last modified on August 21, 2023 11:53 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…