ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి మెల్లగా దారి సుగమం అవుతోంది. నిన్న జరిగిన సుహాసిని కొడుకు వివాహానికి హాజరైన చిన్న బాలయ్యని చూసి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. ఇంతకు ముందు బొద్దుగా ఉన్న రూపాన్ని సన్నబడేలా చేసుకోవడమే కాక లుక్స్ పరంగానూ అతనిలో చాలా మార్పు వచ్చింది. తండ్రితో కలిసి వచ్చి కలివిడిగా తిరగడమే కాదు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ముచ్చటించడం, కలిసి ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అరుదైన కలయికగా ఫ్యాన్స్ ట్వీట్ల రూపంలో పంచుకుంటున్నారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం మోక్షజ్ఞ శిక్షణకు ఇంకో ఆరేడు నెలలు పడుతుందని తెలిసింది. అది పూర్తి కాగానే ఎవరితో ఎలా లాంచ్ చేయించాలనే విషయంలో బాలయ్య ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికైతే పలు ప్రతిపాదనలున్నాయి. పూరి జగన్నాధ్, బోయపాటి శీను, అనిల్ రావిపూడి ఇలా రెండు మూడు ఆప్షన్లు పెట్టుకున్నారు కానీ వాళ్ళ అందుబాటు, స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి కుదరని పక్షంలో బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 999ని ఎలాగూ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అదే ఉండొచ్చు.
వీలైనంత త్వరగా లాంచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య క్రమంగా వయసుకు తగ్గట్టు భగవంత్ కేసరి లాంటి పాత్రల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు కాబట్టి కమర్షియల్ హంగులున్న గ్లామర్ ప్లస్ యాక్షన్ హీరోగా మోక్షజ్ఞను చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. డెబ్యూ పరంగా అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో బాలయ్యకు తెలియనిది కాదు. తన ఎంట్రీ టైంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత శ్రద్ధ తీసుకుని కెరీర్ ని మలచారో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా కొడుకు భవిష్యత్తుని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఒక ఫంక్షన్ ఫోటో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
This post was last modified on August 21, 2023 11:53 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…