మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ నుండి ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ సినిమాకు సంబందించి మ్యూజిక్ విషయంలో మహేష్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే సాంగ్ లేట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే తమన్ ఫస్ట్ సింగిల్ కోసం రెండు వర్షన్స్ రెడీ చేశాడు. ఇద్దరు సింగర్స్ తో ఓకే ట్యూన్ ను రెండు వర్షన్స్ పాడించాడట.
ఇప్పటికే ప్రోమో కట్ రెడీ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ప్రోమో రిలీజవ్వాలి. కానీ మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం టీం వెయిట్ చేస్తున్నారు. వన్స్ మహేష్ ఓకే అనడమే ఆలస్యం మొదటి సాంగ్ అప్ డేట్ బయటికి వచ్చేస్తుంది. మహేష్ ఫైట్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మాస్ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రెండు వర్షన్స్ లో రెండో సింగర్ తో పాడించిన సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక్కడి నుండి పెద్దగా బ్రేక్స్ లేకుండా ఘాట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా పక్కా థియేటర్స్ లోకి రానుందని మీ అందరికీ నచ్చుతుందని మహేష్ తాజాగా ఓ ఈవెంట్ లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్ డేట్ టీం ఎప్పుడు చెప్తారో చూడాలి.
This post was last modified on August 21, 2023 2:36 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…