మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ నుండి ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ సినిమాకు సంబందించి మ్యూజిక్ విషయంలో మహేష్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే సాంగ్ లేట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే తమన్ ఫస్ట్ సింగిల్ కోసం రెండు వర్షన్స్ రెడీ చేశాడు. ఇద్దరు సింగర్స్ తో ఓకే ట్యూన్ ను రెండు వర్షన్స్ పాడించాడట.
ఇప్పటికే ప్రోమో కట్ రెడీ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ప్రోమో రిలీజవ్వాలి. కానీ మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం టీం వెయిట్ చేస్తున్నారు. వన్స్ మహేష్ ఓకే అనడమే ఆలస్యం మొదటి సాంగ్ అప్ డేట్ బయటికి వచ్చేస్తుంది. మహేష్ ఫైట్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మాస్ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రెండు వర్షన్స్ లో రెండో సింగర్ తో పాడించిన సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక్కడి నుండి పెద్దగా బ్రేక్స్ లేకుండా ఘాట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా పక్కా థియేటర్స్ లోకి రానుందని మీ అందరికీ నచ్చుతుందని మహేష్ తాజాగా ఓ ఈవెంట్ లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్ డేట్ టీం ఎప్పుడు చెప్తారో చూడాలి.
This post was last modified on August 21, 2023 2:36 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…