మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ నుండి ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ సినిమాకు సంబందించి మ్యూజిక్ విషయంలో మహేష్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే సాంగ్ లేట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే తమన్ ఫస్ట్ సింగిల్ కోసం రెండు వర్షన్స్ రెడీ చేశాడు. ఇద్దరు సింగర్స్ తో ఓకే ట్యూన్ ను రెండు వర్షన్స్ పాడించాడట.
ఇప్పటికే ప్రోమో కట్ రెడీ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ప్రోమో రిలీజవ్వాలి. కానీ మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం టీం వెయిట్ చేస్తున్నారు. వన్స్ మహేష్ ఓకే అనడమే ఆలస్యం మొదటి సాంగ్ అప్ డేట్ బయటికి వచ్చేస్తుంది. మహేష్ ఫైట్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మాస్ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రెండు వర్షన్స్ లో రెండో సింగర్ తో పాడించిన సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక్కడి నుండి పెద్దగా బ్రేక్స్ లేకుండా ఘాట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా పక్కా థియేటర్స్ లోకి రానుందని మీ అందరికీ నచ్చుతుందని మహేష్ తాజాగా ఓ ఈవెంట్ లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్ డేట్ టీం ఎప్పుడు చెప్తారో చూడాలి.
This post was last modified on August 21, 2023 2:36 pm
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…
ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన…