మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ నుండి ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ సినిమాకు సంబందించి మ్యూజిక్ విషయంలో మహేష్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే సాంగ్ లేట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే తమన్ ఫస్ట్ సింగిల్ కోసం రెండు వర్షన్స్ రెడీ చేశాడు. ఇద్దరు సింగర్స్ తో ఓకే ట్యూన్ ను రెండు వర్షన్స్ పాడించాడట.
ఇప్పటికే ప్రోమో కట్ రెడీ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ప్రోమో రిలీజవ్వాలి. కానీ మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం టీం వెయిట్ చేస్తున్నారు. వన్స్ మహేష్ ఓకే అనడమే ఆలస్యం మొదటి సాంగ్ అప్ డేట్ బయటికి వచ్చేస్తుంది. మహేష్ ఫైట్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మాస్ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రెండు వర్షన్స్ లో రెండో సింగర్ తో పాడించిన సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక్కడి నుండి పెద్దగా బ్రేక్స్ లేకుండా ఘాట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా పక్కా థియేటర్స్ లోకి రానుందని మీ అందరికీ నచ్చుతుందని మహేష్ తాజాగా ఓ ఈవెంట్ లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్ డేట్ టీం ఎప్పుడు చెప్తారో చూడాలి.
This post was last modified on August 21, 2023 2:36 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…