Movie News

ప్రభాస్ తర్వాత రజినీనే

వరుస ఫెయిల్యూర్లు.. మార్కెట్ పతనం.. ఫ్యాన్ ఫాలోయింగ్‌పై ప్రభావం.. ఇదంతా చూసి సూపర్ స్టార్ రజినీకాంత్ పనైపోయిందని చాలామంది తీర్మానించేశారు. రజినీ అభిమానులు పునర్వైభవం అసాధ్యమే అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ టైమింగ్ కలిసి వస్తే సూపర్ స్టార్ ఇప్పటికీ అద్భుతాలు చేయగలడని ‘జైలర్’ మూవీ రుజువు చేసింది.

యావరేజ్ కంటెంట్‌తోనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. తొలి వీకెండ్లోనే ఏకంగా రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. విడుదలైన తొమ్మిది రోజులకే ‘జైలర్’ రూ.500 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడం విశేషం. రజినీ ఈ దశలో ఈ క్లబ్బులోకి వస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. సౌత్ ఇండియాలో ఈ మైలురాయిని రెండుసార్లు అందుకున్న హీరోల్లో ప్రభాస్ తర్వాత రజినీ మాత్రమే ఉన్నాడు.

ప్రభాస్ ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలతో రెండుసార్లు 500 కోట్ల మైలురాయిని అందుకున్నాడు. రజినీ విషయానికి వస్తే.. గతంలో ‘2.ఓ’ చిత్రంతో తొలిసారి 500 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టాడు రజినీ. ఇప్పుడు ‘జైలర్’తో మళ్లీ ఆ మైలురాయిని టచ్ చేశారు. రజినీ కెరీర్లోనే కాక కోలీవుడ్ చరిత్రలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా ‘2.ఓ’ ఉంది. ఆ చిత్రం రూ.560 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది.

‘జైలర్’ దాన్ని దాటి కోలీవుడ్ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం లాంఛనమే అని చెప్పొచ్చు. యుఎస్‌లో మాత్రమే ఈ చిత్రం 5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్’ గ్రాస్ రూ.60 కోట్లు దాటిపోవడం విశేషం. ఒక్క తమిళనాడులో మాత్రమే వసూళ్లు రూ.200 కోట్లను దాటిపోయేలా ఉన్నాయి. కేరళ, కర్ణాటకల్లోనూ ‘జైలర్’ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ వారం కూడా సౌత్ ఇండియన్ బాక్సాఫీస్‌లో పెద్దగా పోటీ లేకపోవడం ‘జైలర్’కు బాగా కలిసొస్తోంది.

This post was last modified on August 20, 2023 4:44 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మనోజ్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ దోబూచులాటలో వెనుకబడిపోయిన మంచు మనోజ్ కంబ్యాక్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…

2 hours ago

ఐదో విడత : ఆ రెండే హాట్ సీట్లు !

దేశం వ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. ఐదో విడత…

4 hours ago

ప్రభాస్ సినిమా వెనక్కు తారక్ మూవీ ముందుకు

దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే దాని గురించి రకరకాల…

4 hours ago

రూ.5 వేలకు ఓటమ్ముకున్న ఎస్సై !

అతడొక బాధ్యతగల అధికారి. అంతే కాదు ప్రజల రక్షణగా నిలిచే పోలీసు అధికారి. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా…

4 hours ago

సోషల్ మీడియాలో పాయల్ ఆవేదన

పరిశ్రమలో అంతర్గతంగా వేధింపుల పర్వాలు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. ఆరెక్స్…

4 hours ago

వైఎస్ ఘ‌ట‌న‌ను గుర్తు చేసిన… ఇరాన్ అధ్య‌క్షుడి ప్ర‌మాదం!

2009 సెప్టెంబ‌రులో ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తికూల వాతావర‌ణ…

5 hours ago