ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలుగా రాజ్ అండ్ డికెలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. స్టయిల్, సస్పెన్స్ ని మిక్స్ చేస్తూ యాక్షన్ డ్రామాలను తీయడంలో వీళ్ళ శైలి చాలా ప్రత్యేకం. ఆ కారణంగానే పెద్ద స్టార్ హీరోలు సైతం వీళ్ళు అడగ్గానే వెబ్ సిరీస్ లకు ఓకే అంటారు. అందుకే కంటెంట్ అటు ఇటు ఊగినా షాహిద్ కపూర్ ఫర్జీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గన్స్ అండ్ గులాబ్స్ అనే కొత్త సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించగా దుల్కర్ సల్మాన్ లాంటి క్యాస్టింగ్ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. ఇంతకీ ఇది మెప్పించేలా ఉందా
గులాబ్ గంజ్ లో ఉండే బైక్ మెకానిక్ టిప్పు(రాజ్ కుమార్ రావు)తండ్రి హత్య వల్ల తానూ రెండు మర్డర్లు చేయాల్సి వస్తుంది. దీంతో అక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. ఆ ఊరికి బదిలీ మీద వస్తాడు పోలీస్ ఆఫీసర్ అర్జున్ వర్మ(దుల్కర్ సల్మాన్). చాలా స్ట్రిక్ట్. లోకల్ డాన్ గాంచి(సతీష్ కౌశిక్) కొడుకు జుగ్ను(ఆదర్శ్ గౌరవ్) ఎలాగైనా కుటుంబ దందాను వారసత్వంగా చేజిక్కించుకోవాలని చూస్తుంటాడు. ఈ ముగ్గురిని నల్లమందు రవాణాకు సంబంధించిన ఒక క్రైమ్ ముడిపెడుతుంది. ఇక్కడి నుంచి క్యాస్ట్ అండ్ మౌస్ గేమ్ షురూ. చివరికి ఏమైందో తెలియాలంటే సిరీస్ చూడాలి.
90 బ్యాక్ డ్రాప్ తీసుకున్న రాజ్ అండ్ డికెలు అప్పటి వాతావరణంలో ఒక మాఫియా థ్రిల్లర్ ని కామెడీ టచ్ తో చూపించే ప్రయత్నం చేశారు. అయితే నిడివి చాలా ఎక్కువ కావడంతో పాటు మూడు ఎపిసోడ్ల వరకు కథ నత్తనడకన సాగడం కొంత విసుగుకు కారణం అయ్యింది. క్యాస్టింగ్ ని అద్భుతంగా సెట్ చేసుకున్న ఈ జంట దర్శక ద్వయం అంతే స్థాయిలో స్క్రిప్ట్ ని రాసుకోలేదు. బోలెడు సమయం, ఓపిక ఉంటే ఓకే కానీ విపరీతమైన అంచనాలు పెట్టుకుని చూస్తే మాత్రం గన్స్ అండ్ గులాబ్స్ పూర్తి సంతృప్తినివ్వదు. ఒకవేళ సినిమాగా తీసుంటే అదిరిపోయేది. అయితే సిరీస్ గా మార్చుకోవడం వల్లే వచ్చింది తంటా.
This post was last modified on August 20, 2023 7:48 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…