తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నాయకుల చేరికలతో పార్టీల్లో సందడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని వాటిని దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో కీలక నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలోనే కారెక్కనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు కేసీఆర్తో చర్చలు పూర్తయ్యాయని కూడా చెబుతున్నారు.
ఇదే నిజమైతే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి బీఆర్ఎస్ తరపున సంగారెడ్డి నుంచి పోటీ చేయడం ఖాయమే. కానీ ఇప్పుడిదే సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలకు రుచించడం లేదు. ముఖ్యంగా అక్కడి నుంచి మరోసారి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్రెడ్డి ఈ విషయంపై అసహనంతో ఉన్నట్లు సమాచారం. అందుకే సంగారెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలు, ముఖ్య అనుచరులతో కలిసి జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ హరీష్ రావును కలిసి విన్నవించారని తెలిసింది.
కానీ జగ్గారెడ్డి విషయంలో హరీష్ రావు కూడా చేయగలిగింది ఏమీ లేదని సమాచారం. తనను కలిసిన సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులకు హరీష్ కచ్చితమైన హామీ ఇవ్వలేకపోయారు. పార్టీలో జగ్గారెడ్డి చేరిక విషయంపై కలుగుతున్న వ్యతిరేకతను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తానని మాత్రమే హరీష్ చెప్పారు. అంతే కాకుండా టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం అందరు కలిసే పని చేయాలని కూడా హరీష్ చెప్పారని తెలిసింది. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే జగ్గారెడ్డిని ఆపడం హరీష్ వల్ల కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అనుకున్నది కచ్చితంగా చేసి తీరతారనే పేరుంది. అందుకే ఈ విషయంలో హరీష్ రావు ఏం చేయలేకపోతున్నారని టాక్.
This post was last modified on August 19, 2023 3:30 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…