తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నాయకుల చేరికలతో పార్టీల్లో సందడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని వాటిని దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో కీలక నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలోనే కారెక్కనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు కేసీఆర్తో చర్చలు పూర్తయ్యాయని కూడా చెబుతున్నారు.
ఇదే నిజమైతే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి బీఆర్ఎస్ తరపున సంగారెడ్డి నుంచి పోటీ చేయడం ఖాయమే. కానీ ఇప్పుడిదే సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలకు రుచించడం లేదు. ముఖ్యంగా అక్కడి నుంచి మరోసారి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్రెడ్డి ఈ విషయంపై అసహనంతో ఉన్నట్లు సమాచారం. అందుకే సంగారెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలు, ముఖ్య అనుచరులతో కలిసి జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ హరీష్ రావును కలిసి విన్నవించారని తెలిసింది.
కానీ జగ్గారెడ్డి విషయంలో హరీష్ రావు కూడా చేయగలిగింది ఏమీ లేదని సమాచారం. తనను కలిసిన సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులకు హరీష్ కచ్చితమైన హామీ ఇవ్వలేకపోయారు. పార్టీలో జగ్గారెడ్డి చేరిక విషయంపై కలుగుతున్న వ్యతిరేకతను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తానని మాత్రమే హరీష్ చెప్పారు. అంతే కాకుండా టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం అందరు కలిసే పని చేయాలని కూడా హరీష్ చెప్పారని తెలిసింది. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే జగ్గారెడ్డిని ఆపడం హరీష్ వల్ల కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అనుకున్నది కచ్చితంగా చేసి తీరతారనే పేరుంది. అందుకే ఈ విషయంలో హరీష్ రావు ఏం చేయలేకపోతున్నారని టాక్.
This post was last modified on August 19, 2023 3:30 pm
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…