తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నాయకుల చేరికలతో పార్టీల్లో సందడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని వాటిని దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో కీలక నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలోనే కారెక్కనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు కేసీఆర్తో చర్చలు పూర్తయ్యాయని కూడా చెబుతున్నారు.
ఇదే నిజమైతే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి బీఆర్ఎస్ తరపున సంగారెడ్డి నుంచి పోటీ చేయడం ఖాయమే. కానీ ఇప్పుడిదే సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలకు రుచించడం లేదు. ముఖ్యంగా అక్కడి నుంచి మరోసారి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్రెడ్డి ఈ విషయంపై అసహనంతో ఉన్నట్లు సమాచారం. అందుకే సంగారెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలు, ముఖ్య అనుచరులతో కలిసి జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ హరీష్ రావును కలిసి విన్నవించారని తెలిసింది.
కానీ జగ్గారెడ్డి విషయంలో హరీష్ రావు కూడా చేయగలిగింది ఏమీ లేదని సమాచారం. తనను కలిసిన సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులకు హరీష్ కచ్చితమైన హామీ ఇవ్వలేకపోయారు. పార్టీలో జగ్గారెడ్డి చేరిక విషయంపై కలుగుతున్న వ్యతిరేకతను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తానని మాత్రమే హరీష్ చెప్పారు. అంతే కాకుండా టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం అందరు కలిసే పని చేయాలని కూడా హరీష్ చెప్పారని తెలిసింది. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే జగ్గారెడ్డిని ఆపడం హరీష్ వల్ల కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అనుకున్నది కచ్చితంగా చేసి తీరతారనే పేరుంది. అందుకే ఈ విషయంలో హరీష్ రావు ఏం చేయలేకపోతున్నారని టాక్.
This post was last modified on August 19, 2023 3:30 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…