Movie News

గదర్ 2 చూసి వాత పెట్టుకుంటున్నారు

ఏదో హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తున్న గదర్ 2 చూసి ఒక్కసారిగా బాలీవుడ్ దర్శక నిర్మాతల్లో చలనం వచ్చేసింది. సన్నీడియోల్ మీద బడ్జెట్ పెడితే వర్కౌట్ కాదని ఏళ్ళ క్రితమే కథలు రాయడం మానేసిన రచయితలు ఒక్కసారిగా స్టోరీలకు బూజు దులుపుతున్నారు. ముఖ్యంగా ఆయన నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ కి కొనసాగింపులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. అందులో మొదటిది బోర్డర్. 1997లో జెపి దత్తా తీసిన ఈ ఇండియా పాకిస్థాన్ వార్ డ్రామా అప్పట్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

బోర్డర్ సృష్టికర్త జెపి దత్తా ఇప్పుడు సీక్వెల్ పైన దృష్టి పెట్టారు. కూతురు నిధి దత్తాతో స్క్రిప్ట్ కి ఒక రూపం కల్పిస్తున్నారు. అయితే మొదటి భాగం మల్టీస్టారర్ గా రూపొందింది. సన్నీతో పాటు జాకీ శ్రోఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్ లాంటి ఎందరో హీరోలు భాగమయ్యారు. ఇప్పుడు 1971 యుద్ధ నేపధ్యాన్ని తీసుకుని బోర్డర్ 2 తీయాలనే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు ఘాయల్, ఘాతక్, దామిని, సలాకే, అర్జున్, ఆప్నే లాంటి  హిట్లని కంటిన్యూ చేద్దామని సన్నీ డియోల్ కు ఫోన్ చేస్తున్నారట సదరు ప్రొడ్యూసర్లు. ఇటీవలే కొడుకు పెళ్లి చేసి గదర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ లేట్ ఏజ్ హీరోకిది అనూహ్యమే.

అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు గదర్ 2 విజయం వెనుక బోలెడు కారణాలున్నాయి. పాటలు, బలమైన యాంటీ పాక్ సెంటిమెంట్, డైలాగులు వర్కౌట్ అయ్యాయి. అంతే తప్ప కేవలం సన్నీ డియోల్ చేశాడని కాదు. అది మర్చిపోయి హఠాత్తుగా వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతో ఇలా తొందరపడితే చేతులు కాల్చుకోవడం ఖాయం. పఠాన్ తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన గదర్ 2 వల్ల నార్త్ బాక్సాఫీస్ లో ఉత్సాహం వచ్చిన మాట వాస్తవమే కానీ దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయి సీక్వెల్స్ వర్షం కురిపిస్తామంటే మాత్రం దెబ్బ తినక తప్పదు.

This post was last modified on August 19, 2023 4:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago