ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్, నెక్స్ట్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. మొన్నటి వరకూ బుచ్చి బాబు కొందరు రైటర్స్ తో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాడు. ఇక నుండి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ నెలలోనే సినిమాకి ఆఫీస్ పూజ జరగనుంది. ఆఫీస్ స్టార్ట్ అయ్యాక కాస్టింగ్ ఫైనల్ చేయబోతున్నారు.
ఆ తర్వాత లొకేషన్స్ వేట మొదలు పెట్టనున్నారు. ఇదే నెలలో రెహ్మాన్ తో మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే ఏ రెహ్మాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా లాక్ చేసుకున్నరు. రెహ్మాన్ ఆఫీషియల్ గా ఈ విషయం చెప్పేశాడు. ఇలా చకచకా బుచ్చిబాబు పనులు మొదలు పెట్టి రామ్ చరణ్ ఫ్రీ అయ్యే తరణం కోసం చూస్తున్నాడు. వన్స్ శంకర్ ‘గేమ్ ఛేంజర్’ పూర్తవ్వగానే బుచ్చిబాబు సినిమాను మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడు చరణ్.
రెహ్మాన్ తో పాటు ఈ సినిమాకు ఇంకా పెద్ద టెక్నీషియన్స్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే వారి డీటైల్స్ కూడా బయటికి రానున్నాయి. మొదటి సినిమాతోనే వంద కోట్ల గ్రాస్ అందుకున్న బుచ్చి బాబు కి చరణ్ సినిమా గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఈ కుర్ర దర్శకుడు ఎలా సద్వినియోగం చేసుకుంటాడో ? వేచి చూడాలి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…