గంపగుత్తగా వస్తున్న రీ రిలీజుల దెబ్బకు ఫ్యాన్స్ సైతం బాబోయ్ అనుకునే పరిస్థితి తలెత్తుతోంది. అసలు విడుదలైన టైంలో డిజాస్టర్లుగా పేరు తెచ్చుకున్న వాటిని సైతం వదలకుండా సోషల్ మీడియాని వాడుకుని మరీ ప్రోమోట్ చేస్తున్న తీరు ఉదయం ఆటలను హౌస్ ఫుల్స్ చేయిస్తోంది. ముఖ్యంగా ఆరంజ్ కు వచ్చిన రెస్పాన్స్ ఈ నమ్మకాన్ని రెట్టింపు చేసింది. తాజాగా యోగికి వచ్చిన స్పందన చూస్తుంటే ఆమ్మో అనిపించకమానదు. అయితే అందరు స్టార్ హీరోలకు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా ఫ్లాపే అనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకూడదు.
కొన్ని నెలల క్రితం ఆంధ్రావాలాని ఇలాగే క్యాష్ చేసుకోబోయి బయ్యర్లు భంగపడ్డారు. అదే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి మీద రికార్డుల వర్షం కురిసింది. కాబట్టి టైమింగ్ తో పాటు కంటెంట్ కూడా కీలకం. త్వరలో బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు, లయన్ సినిమాలను పునః విడుదల చేయబోతున్నట్టు పలు ట్విట్టర్ హ్యాండిల్స్ లో కనిపించడంతో అభిమానులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఇవి మాములు ఫ్లాప్స్ కావు. కనీసం పాటలు బాగున్నా ఏదో ఎంజాయ్ చేయడం కోసం చూడొచ్చులే అనుకోవచ్చు. కానీ ఏ రకంగా చూసినా ఆ అర్హత లేని వాటికి థియేటర్లకు దింపడం అన్యాయమే.
చెన్నకేశవరెడ్డిని ఎంజాయ్ చేశారు. నరసింహనాయుడు, సింహాకి కొత్త అనుభూతి చెందారు. ఇలాంటి హిట్ మూవీస్ ని తీసుకురావడం ఎంతైనా స్వాగతించాల్సిన విషయమే. భైరవ ద్వీపం అన్నారు కానీ ఇంకా మోక్షం దక్కలేదు. ఇవే కాదు ఆదిత్య 369, మంగమ్మ గారి మనవడు, సమరసింహారెడ్డి, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఉండగా పనిగట్టుకుని లయన్, ఒక్క మగాడు ఎందుకనేది మూవీ లవర్స్ ప్రశ్న. ఇది నిజం కాకపోతే బాగుండని అందరూ కోరుకుంటున్నారు. ఈ లెక్కన మృగరాజు, సరదాబుల్లోడు, భాయ్ లాంటివి కూడా వదిలి భయపెడతారేమో బయ్యర్లు.
This post was last modified on August 19, 2023 1:24 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…