టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ముందు గుర్తొచ్చే పేరు శ్రీలీల. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ దాకా అందరూ తననే కోరుకుంటున్నారు. రెమ్యునరేషన్ ఎంతైనా సరే ఇచ్చేందుకు నిర్మాతలూ సిద్ధంగా ఉన్నారు. ఇకపై ఈ అమ్మడి నుంచి నాన్ స్టాప్ గా నెలకో సినిమా అభిమానులకు కానుకగా రాబోతున్నాయి. సెప్టెంబర్ 15 రామ్ తో జంటగా నటించిన ‘స్కంద’ మీద ఆల్రెడీ అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. లిరికల్ వీడియోల్లో స్టెప్పులు చూసి హైప్ ఇంకాస్త పెరుగుతోంది. వినాయక చవితి పండగను లక్ష్యంగా చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బిజినెస్ క్రేజీగా ఉంది.
అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ వస్తోంది. బాలకృష్ణ-కాజల్ అగర్వాల్ జంటగా నటించగా శ్రీలీల పాత్ర తీరుతెన్నులకు సంబంధించి లీక్ బయటికి రాకుండా అనిల్ రావిపూడి బృందం జాగ్రత్త పడుతోంది. క్యారెక్టర్ ఏదైనా ఇందులోనూ నృత్యాలకు లోటు లేదట. తాజాగా వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’కు రిలీజ్ డేట్ గా నవంబర్ 10ని లాక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ టెంపుల్ థ్రిల్లర్ మీద హైప్ బాగానే ఉంది. డిసెంబర్ 23న నితిన్ తో కలిసి వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ ట్రాడినరీ మేన్’ లో దర్శనమివ్వనుంది.
కొత్త ఏడాది 2024 ప్రారంభం కావడం ఆలస్యం జనవరి 12న ‘గుంటూరు కారం’లో మహేష్ బాబుతో ఆడిపాడటం చూడొచ్చు. పూజా హెగ్డే స్థానంలో మెయిన్ హీరోయిన్ గా మారిపోయిన శ్రీలీలకు దీని సక్సెస్ చాలా కీలకం. టాప్ లీగ్ లో చేరడంతో పాటు పారితోషికం అమాంతం పెరిగిపోతుంది. ఇలా మొత్తం అయిదు నెలలకు గాను అయిదు రిలీజులతో శ్రీలీల క్యాలెండర్ క్రేజీగా ఉంది. ఒకపక్కా షూటింగుల్లో పాల్గొంటూనే వీటికి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో భాగం కావాల్సి ఉంటుంది. ధమాకా నుంచి శ్రీలీల ఫ్యాన్స్ గా మారిపోయిన వాళ్లకు ఇక రెగ్యులర్ పండగే.
This post was last modified on August 19, 2023 1:12 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…