సినీ పరిశ్రమలో ప్రతిభకు తోడు అదృష్టం ఉంటేనే ఎవ్వరైనా నిలదొక్కుకోగలరు. ఒక హీరోకు మంచి నటుడిగా పేరు వస్తే సరిపోదు. కాలం కలిసి వచ్చి విజయాలు కూడా దక్కాలి. కానీ కొద్దిమంది మాత్రమే ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటారు. యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ కోవకే చెందుతాడు. ‘వర్షం’ సినిమా తీసిన దివంగత దర్శకుడు శోభన్ తనయుడే ఈ కుర్రాడు.
తండ్రికి టాలీవుడ్లో ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతోనే కాక త్రివిక్రమ్, కృష్ణవంశీ లాంటి దర్శకులతో శోభన్కు మంచి పరిచయం ఉంది. ఆ పరిచయాలే ఆయన మరణానంతరం కూడా కొడుక్కి ఉపయోగపడుతున్నాయి. బేసిగ్గా సంతోష్ కూడా మంచి నటుడని సహాయ పాత్ర చేసిన ‘గోల్కొండ హైస్కూల్’తోనే అందరికీ అర్థమైంది. ఆ తర్వాత అతను ‘తను నేను’ చిత్రంతో హీరో అయ్యాడు. ఇప్పటిదాకా హీరోగా ఎనిమిది సినిమాల్లో నటించాడు.
కానీ థియేటర్లలో సంతోష్ శోభన్ సినిమాలేవీ ప్రభావం చూపలేకపోయాయి. ఓటీటీలో నేరుగా రిలీజైన ‘ఏక్ మినీ కథ’ మాత్రమే మంచి స్పందన తెచ్చుకుంది. పేపర్ బాయ్, మంచి రోజులొచ్చాయి, లైక్ షేర్ సబ్స్క్రైబ్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే.. ఇలా ప్రతి సినిమా కూడా తేడా కొట్టేసింది. ఇప్పుడు ‘ప్రేమ్ కుమార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు.
‘జైలర్’తో పాటు పాత సినిమాలైన యోగి, రఘువరన్ బీటెక్ సినిమాల కోసం ఎగబడుతున్న ప్రేక్షకులు ఈ వారం వస్తున్న కొత్త సినిమాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఐతే సంతోష్ మాత్రం ‘ప్రేమ్ కుమార్’ తనకు బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో కానీ.. సంతోష్కు రెండు పెద్ద బేనర్లలో సినిమాల కమిట్మెంట్లు ఉన్నాయట. యువి క్రియేషన్స్తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ అతడితో సినిమాలు నిర్మించబోతున్నాయట. ఇన్ని ఫ్లాపుల తర్వాత ఇంత పెద్ద బేనర్లలో అవకాశాలు అందుకోవడం అంటే సంతోష్కు ఎక్కడో సుడి ఉన్నట్లే.
This post was last modified on August 18, 2023 3:00 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…