సినీ పరిశ్రమలో ప్రతిభకు తోడు అదృష్టం ఉంటేనే ఎవ్వరైనా నిలదొక్కుకోగలరు. ఒక హీరోకు మంచి నటుడిగా పేరు వస్తే సరిపోదు. కాలం కలిసి వచ్చి విజయాలు కూడా దక్కాలి. కానీ కొద్దిమంది మాత్రమే ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటారు. యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ కోవకే చెందుతాడు. ‘వర్షం’ సినిమా తీసిన దివంగత దర్శకుడు శోభన్ తనయుడే ఈ కుర్రాడు.
తండ్రికి టాలీవుడ్లో ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతోనే కాక త్రివిక్రమ్, కృష్ణవంశీ లాంటి దర్శకులతో శోభన్కు మంచి పరిచయం ఉంది. ఆ పరిచయాలే ఆయన మరణానంతరం కూడా కొడుక్కి ఉపయోగపడుతున్నాయి. బేసిగ్గా సంతోష్ కూడా మంచి నటుడని సహాయ పాత్ర చేసిన ‘గోల్కొండ హైస్కూల్’తోనే అందరికీ అర్థమైంది. ఆ తర్వాత అతను ‘తను నేను’ చిత్రంతో హీరో అయ్యాడు. ఇప్పటిదాకా హీరోగా ఎనిమిది సినిమాల్లో నటించాడు.
కానీ థియేటర్లలో సంతోష్ శోభన్ సినిమాలేవీ ప్రభావం చూపలేకపోయాయి. ఓటీటీలో నేరుగా రిలీజైన ‘ఏక్ మినీ కథ’ మాత్రమే మంచి స్పందన తెచ్చుకుంది. పేపర్ బాయ్, మంచి రోజులొచ్చాయి, లైక్ షేర్ సబ్స్క్రైబ్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే.. ఇలా ప్రతి సినిమా కూడా తేడా కొట్టేసింది. ఇప్పుడు ‘ప్రేమ్ కుమార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు.
‘జైలర్’తో పాటు పాత సినిమాలైన యోగి, రఘువరన్ బీటెక్ సినిమాల కోసం ఎగబడుతున్న ప్రేక్షకులు ఈ వారం వస్తున్న కొత్త సినిమాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఐతే సంతోష్ మాత్రం ‘ప్రేమ్ కుమార్’ తనకు బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో కానీ.. సంతోష్కు రెండు పెద్ద బేనర్లలో సినిమాల కమిట్మెంట్లు ఉన్నాయట. యువి క్రియేషన్స్తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ అతడితో సినిమాలు నిర్మించబోతున్నాయట. ఇన్ని ఫ్లాపుల తర్వాత ఇంత పెద్ద బేనర్లలో అవకాశాలు అందుకోవడం అంటే సంతోష్కు ఎక్కడో సుడి ఉన్నట్లే.
This post was last modified on August 18, 2023 3:00 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…