సినీ పరిశ్రమలో ప్రతిభకు తోడు అదృష్టం ఉంటేనే ఎవ్వరైనా నిలదొక్కుకోగలరు. ఒక హీరోకు మంచి నటుడిగా పేరు వస్తే సరిపోదు. కాలం కలిసి వచ్చి విజయాలు కూడా దక్కాలి. కానీ కొద్దిమంది మాత్రమే ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటారు. యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ కోవకే చెందుతాడు. ‘వర్షం’ సినిమా తీసిన దివంగత దర్శకుడు శోభన్ తనయుడే ఈ కుర్రాడు.
తండ్రికి టాలీవుడ్లో ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతోనే కాక త్రివిక్రమ్, కృష్ణవంశీ లాంటి దర్శకులతో శోభన్కు మంచి పరిచయం ఉంది. ఆ పరిచయాలే ఆయన మరణానంతరం కూడా కొడుక్కి ఉపయోగపడుతున్నాయి. బేసిగ్గా సంతోష్ కూడా మంచి నటుడని సహాయ పాత్ర చేసిన ‘గోల్కొండ హైస్కూల్’తోనే అందరికీ అర్థమైంది. ఆ తర్వాత అతను ‘తను నేను’ చిత్రంతో హీరో అయ్యాడు. ఇప్పటిదాకా హీరోగా ఎనిమిది సినిమాల్లో నటించాడు.
కానీ థియేటర్లలో సంతోష్ శోభన్ సినిమాలేవీ ప్రభావం చూపలేకపోయాయి. ఓటీటీలో నేరుగా రిలీజైన ‘ఏక్ మినీ కథ’ మాత్రమే మంచి స్పందన తెచ్చుకుంది. పేపర్ బాయ్, మంచి రోజులొచ్చాయి, లైక్ షేర్ సబ్స్క్రైబ్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే.. ఇలా ప్రతి సినిమా కూడా తేడా కొట్టేసింది. ఇప్పుడు ‘ప్రేమ్ కుమార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు.
‘జైలర్’తో పాటు పాత సినిమాలైన యోగి, రఘువరన్ బీటెక్ సినిమాల కోసం ఎగబడుతున్న ప్రేక్షకులు ఈ వారం వస్తున్న కొత్త సినిమాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఐతే సంతోష్ మాత్రం ‘ప్రేమ్ కుమార్’ తనకు బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో కానీ.. సంతోష్కు రెండు పెద్ద బేనర్లలో సినిమాల కమిట్మెంట్లు ఉన్నాయట. యువి క్రియేషన్స్తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ అతడితో సినిమాలు నిర్మించబోతున్నాయట. ఇన్ని ఫ్లాపుల తర్వాత ఇంత పెద్ద బేనర్లలో అవకాశాలు అందుకోవడం అంటే సంతోష్కు ఎక్కడో సుడి ఉన్నట్లే.
This post was last modified on August 18, 2023 3:00 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…