సూపర్ స్టార్ రజినీకాంత్ చివరి మూడు సినిమాలు పేట, దర్బార్, అన్నాత్తె.. ఒకదాన్ని మించి ఒకటి నిరాశ పరిచాయి. వసూళ్ల లెక్కలు కూడా సినిమా సినిమాకూ తగ్గుతూ వచ్చాయి. ‘అన్నాత్తె’ అయితే దారుణమైన ఫలితాన్నందుకుంది. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రిలీజైన ఈ సినిమా పూర్తిగా వాషౌట్ అయిపోయింది. గత మూడు దశాబ్దాల్లో రజినీ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఇంత తక్కువ ప్రభావం చూపలేదు. అంత కనీస స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. ఫుల్ రన్లో రూ.5 కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి. కానీ ఈ సినిమాకు ఇలాంటి ఫలితం రావడం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు.. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్కు మాత్రం బాగా కలిసొచ్చింది. ఒక హీరో చివరి సినిమా ఫలితం ఆధారంగానే తర్వాతి చిత్రానికి బిజినెస్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ‘పెద్దన్న’ దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో ‘జైలర్’కు కొంచెం క్రేజ్ ఉన్నా సరే.. రూ.12 కోట్లకే తెలుగు థియేట్రికల్ హక్కులు లభించాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సునీల్ నారంగ్ భాగస్వామ్యంతో ‘జైలర్’ను రిలీజ్ చేశాడు దిల్ రాజు. సినిమా మీద పెట్టుబడిని రెండో రోజుకే రికవర్ చేసేసింది ‘జైలర్’. రెండో రోజే లాభాలు కూడా మొదలైపోయాయి. ఈ సినిమా వారం రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్స్తో నడుస్తోంది. వారం తిరిగేసరికే రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. షేర్ ఇప్పటికే రూ.30 కోట్లు దాటిపోయింది. ఫుల్ రన్లో షేర్ మాత్రమే రూ.50 కోట్లకు చేరువ అయినా ఆశ్చర్యం లేదు. అంటే పెట్టుబడి మీద ఎంత లాభమో అర్థం చేసుకోవచ్చు. ‘జైలర్’కు మంచి టాక్ వచ్చినా సరే.. ఈ స్థాయిలో వసూళ్లు వస్తాయని దిల్ రాజు సహా ఎవ్వరూ ఊహించి ఉండరు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’ పోటీలో ఉంది కాబట్టి వసూళ్లు ఒక స్థాయికి మించి రావని అంచనా వేసి ఉంటారు. కానీ ‘జైలర్’ దెబ్బకు చిరు సినిమా కుదేలైంది. దాని స్క్రీన్లను కూడా ఈ చిత్రంతోనే రీప్లేస్ చేశారు. ప్రేక్షకులు విరగబడి ఈ సినిమాను చూస్తుండటంతో వసూళ్లు కూడా అంచనాలకు అందని స్థాయిలో వస్తున్నాయి.
This post was last modified on August 18, 2023 2:57 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…